ETV Bharat / state

గాలివాన బీభత్సానికి.. అరటి, మామిడి రైతులకు తీవ్ర నష్టం

అనంతపురం జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు అరటి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికందే సమయంలో ఇలా జరగడం వల్ల రూ. 2 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు.

author img

By

Published : Apr 24, 2021, 8:16 PM IST

farmers lost crop due to rains
అరటి, మామిడి రైతులకు తీవ్ర నష్టం

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలో కురిసిన భారీ వర్షాలకు అరటి, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మండలంలోని ఎల కుంట గ్రామాలలో గాలి వాన బీభత్సానికి అరటి పంట నేల వాలింది. మరికొన్ని రోజుల్లో పంట చేతికొచ్చే దశలో గాలివానకు అరటి గెలలు నేలకూలగా.. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.

అకాల వర్షాల వల్ల సుమారు రూ. 2 కోట్ల మేర పంటనష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. కనీసం పెట్టుబడి కూడా చేతికి తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలో కురిసిన భారీ వర్షాలకు అరటి, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మండలంలోని ఎల కుంట గ్రామాలలో గాలి వాన బీభత్సానికి అరటి పంట నేల వాలింది. మరికొన్ని రోజుల్లో పంట చేతికొచ్చే దశలో గాలివానకు అరటి గెలలు నేలకూలగా.. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.

అకాల వర్షాల వల్ల సుమారు రూ. 2 కోట్ల మేర పంటనష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. కనీసం పెట్టుబడి కూడా చేతికి తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చదవండి:

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి .. మరొకరికి తీవ్ర గాయలు

మద్యం దొరక్క శానిటైజర్ తాగి ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.