ETV Bharat / state

ద్విచక్రవాహనంపై పడిన చెట్టు.. ముగ్గురికి గాయాలు

author img

By

Published : May 31, 2020, 11:37 PM IST

అనంతపురం జిల్లా రొద్దం మండలంలో గాలివాన భీభత్సానికి రహదారి పక్కన ఉన్న చెట్టు విరిగి ద్విచక్రవాహనం పై పడింది. ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి.

due to heavy rain and air trees breaks out and fell on two wheeler 3 injured
due to heavy rain and air trees breaks out and fell on two wheeler 3 injured

గాలివాన భీభత్సానికి చెట్టు.. ఓ ద్విచక్రవాహనంపై పడింది. వాహనంపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని పెద్దగువ్వలపల్లికి చెందిన ముగ్గురు.. పొలం పనులు ముగించుకుని గ్రామానికి తిరిగివస్తుండగా... చిన్నగువ్వలపల్లి గ్రామానికి వెళ్లే మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని.. జాలిచెట్టు ముళ్ల కింద చికుక్కొన్న ముగ్గురు బాధితులను బయటలకు తీశారు. బంధువుల సాయంతో కర్ణాటకలోని పావగడలో ఓ ప్రెయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించినట్లు స్థానికులు వివరించారు.

గాలివాన భీభత్సానికి చెట్టు.. ఓ ద్విచక్రవాహనంపై పడింది. వాహనంపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని పెద్దగువ్వలపల్లికి చెందిన ముగ్గురు.. పొలం పనులు ముగించుకుని గ్రామానికి తిరిగివస్తుండగా... చిన్నగువ్వలపల్లి గ్రామానికి వెళ్లే మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని.. జాలిచెట్టు ముళ్ల కింద చికుక్కొన్న ముగ్గురు బాధితులను బయటలకు తీశారు. బంధువుల సాయంతో కర్ణాటకలోని పావగడలో ఓ ప్రెయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించినట్లు స్థానికులు వివరించారు.

ఇదీ చూడండి:

ఏపీలో 3వేలు దాటిన కరోనా బాధితులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.