అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని పరిస్థితిని జిల్లా సహాయ కలెక్టర్ జాహ్నవి సమీక్షించారు. బాధితునికి కాంటాక్ట్లో ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్కు తరలించామని తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు రెడ్జోన్ గా గుర్తించి కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. రెడ్జోన్ ప్రాంతాల్లోంచి ఎవరూ బయటకు రాకుండా, కొత్తవారు లోపలికి వెళ్లకుండా చూడాలని పోలీసులకు సూచించారు.
ఇదీచదవండి.