అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోట ప్రాంతంలో ఉన్న ముస్లింల ప్రార్థనా మందిరం ఫోర్ట్ గేట్ మసీదులో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. దొంగలు మసీదు ప్రహరీ గోడ పైనుంచి దూకి లోనికి ప్రవేశించారు. మసీదులోని హుండీని ఇనుప రాడ్తో బద్దలుకొట్టారు. రాత్రి కావడం, వర్షం రావడంతో మసీదులో ఎవరూ లేకపోవడం గమనించిన దొంగలు హుండీలోని సొమ్ముతో పరారయ్యారు. హుండీలో ఎంత సొమ్ము ఉండవచ్చు అనేది తెలియాల్సి ఉంది. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాయదుర్గం పట్టణంలో వారంరోజుల క్రితం రెండు మసీదులలో దొంగలు పడి హుండీలను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లారు.
ఇదీ చదవండి : ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు