ETV Bharat / state

తేలికపాటి వర్షాలు... రైతులకు తీరని కష్టాలు - అనంతపురంలో వర్షాలకు పంట నష్టపోయిన రైతులు వార్తలు

అనంతపురం జిల్లాలో కురిసిన తేలికపాటి వర్షాలకు రైతులు లక్షలు విలువ చేసే పంట నష్టపోయారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఉద్యాన పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేశారు.

crop lossed farmers by the rains
తేలికపాటి వర్షానికి లక్షల్లో పంట నష్టం
author img

By

Published : May 3, 2020, 9:21 AM IST

Updated : May 3, 2020, 4:03 PM IST


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో కురిసిన తేలికపాటి వర్షానికి లక్షలాది రూపాయల ఉద్యాన పంటలు కూరగాయల పంటలు దెబ్బ తిన్నాయి. ఇది రైతులను కన్నీరు పెట్టిస్తోంది. బోరంపల్లి, పాత చెరువు గ్రామాల్లో రైతులకు చెందిన అరటి పండ్లతోపాటు కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెవెన్యూ వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు. ఉద్యాన పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో కురిసిన తేలికపాటి వర్షానికి లక్షలాది రూపాయల ఉద్యాన పంటలు కూరగాయల పంటలు దెబ్బ తిన్నాయి. ఇది రైతులను కన్నీరు పెట్టిస్తోంది. బోరంపల్లి, పాత చెరువు గ్రామాల్లో రైతులకు చెందిన అరటి పండ్లతోపాటు కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెవెన్యూ వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు. ఉద్యాన పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి..

ఎలుగుబంటి దాడి.. ఉపాధి హామీ కూలీకి గాయాలు

Last Updated : May 3, 2020, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.