ETV Bharat / state

'వ్యవసాయ పరిశోధన కేంద్ర తరలింపు జీవోను ఉపసంహరించుకోవాలి'

author img

By

Published : Jun 20, 2021, 6:37 AM IST

నంద్యాలలో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రం తరలించడానికి తెచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాయలసీమ సబ్​ కమిటీ కన్వీనర్ ఓబులు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి మఖ్యమంత్రికి లేఖ రాశానన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నాణ్యత గల విత్తనాలను ఈ కేంద్రం నుంచి అందించినట్లు చెప్పారు.

cpm
cpm

నంద్యాలలో వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని తరలించాలని తెచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ ఓబులు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్​కు ఈ విషయంపై లేఖ రాసినట్లు చెప్పారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో దీనికి సంబంధించిన లేఖను విడుదల చేశారు.

పరిశోధన కేంద్రం ఉన్న 50 ఎకరాలలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు నాణ్యతతో కూడిన విత్తనాలను ఈ కేంద్రం నుంచి అందించారని గుర్తుచేశారు. వైద్య కళాశాల ఏర్పాటుకు తామేమీ వ్యతిరేకం కాదని, అయితే వ్యవసాయ కేంద్రానికి సంబంధించిన స్థలంలో కాకుండా ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి కళాశాలల ఏర్పాటు చేయాలని కోరారు.

నంద్యాలలో వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని తరలించాలని తెచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ ఓబులు.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్​కు ఈ విషయంపై లేఖ రాసినట్లు చెప్పారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో దీనికి సంబంధించిన లేఖను విడుదల చేశారు.

పరిశోధన కేంద్రం ఉన్న 50 ఎకరాలలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు నాణ్యతతో కూడిన విత్తనాలను ఈ కేంద్రం నుంచి అందించారని గుర్తుచేశారు. వైద్య కళాశాల ఏర్పాటుకు తామేమీ వ్యతిరేకం కాదని, అయితే వ్యవసాయ కేంద్రానికి సంబంధించిన స్థలంలో కాకుండా ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి కళాశాలల ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

కడప జంట హత్యలపై లోకేశ్ వ్యాఖ్యలు సరికాదు: వైకాపా నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.