కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. ఆ చట్టాలకు సంబంధించిన జీవో పేపర్లను బోగి మంటల్లో వేసి తగులపెట్టారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లక్షల మంది రైతులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
ఇదీ చదవండి: చౌక ధరల దుకాణంలో నాసిరకం బియ్యం పంపిణీ.. లబ్ధిదారులు ఆందోళన