అనంతపురం జిల్లా చిత్రావతి జలాశయం వద్ద ముంపు గ్రామాలుగా ఉన్న చిన్న చిగుళ్ల రేవు, మరిమాకులపల్లి గ్రామాల్లో కలెక్టర్ గంధం చంద్రుడు పర్యటించారు. తమ భూములు ముంపునకు గురవుతున్న కారణంగా నష్టపరిహారం ఇప్పించాలంటూ రైతులు కలెక్టర్ను కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్... త్వరగా రైతుల జాబితాను సిద్ధం చేసి రెండు మాసాల్లోపు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : ఆవ ముంపు గ్రామాల ప్రజల సత్యాగ్రహం