ETV Bharat / state

కదిలే రైల్లో నుంచి కింద పడి చిన్నారి మృతి

author img

By

Published : Jan 23, 2021, 11:23 AM IST

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని నడింపల్లి సమీపంలో కదులుతున్న రైల్లో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి 3ఏళ్ల చిన్నారి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కదిలే రైల్లో నుంచి కింద పడి చిన్నారి మృతి
కదిలే రైల్లో నుంచి కింద పడి చిన్నారి మృతి

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో కదులుతున్న రైల్లో నుంచి 3 ఏళ్ల చిన్నారి జారి కింద పడిపోయింది. తమిళనాడుకు చెందిన మురుగన్, సంగీత తమ మూడేళ్ల చిన్నారి వృతికతో కలిసి ముంబాయి నుంచి కుర్లా రైలులో బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం రైలు... చాలకూరు గ్రామ సమీపంలోకి చేరుకొన్న సమయంలో సంగీత తమ చిన్నారికి భోజనం తినిపించి కుళాయి వద్ద చేయి కడుగుతుండగా.. ఆమె చేతిలో నుంచి చిన్నారి జారి కింద పడిపోయింది. వెంటనే కేకలు వేసి భర్తకు, తోటి ప్రయాణికులకు చెప్పింది.

ప్రయాణికులు రైలులో గొలుసు లాగి ఆపేశారు. బాధితులు తమ పాప ఆచూకీ కోసం రైలు పట్టాలపై పరుగులు తీస్తూ గాలింపు చేపట్టారు. ఆచూకీ లభించక పోవడంతో రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై బాలాజీనాయక్, తమ సిబ్బందితో కలిసి చిన్నారి మృతదేహన్ని కనుగొన్నారు. అనంతరం అంబులెన్స్ లో మృతదేహన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ చిన్నారి మృతదేహాన్ని చూసి... తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి.

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో కదులుతున్న రైల్లో నుంచి 3 ఏళ్ల చిన్నారి జారి కింద పడిపోయింది. తమిళనాడుకు చెందిన మురుగన్, సంగీత తమ మూడేళ్ల చిన్నారి వృతికతో కలిసి ముంబాయి నుంచి కుర్లా రైలులో బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం రైలు... చాలకూరు గ్రామ సమీపంలోకి చేరుకొన్న సమయంలో సంగీత తమ చిన్నారికి భోజనం తినిపించి కుళాయి వద్ద చేయి కడుగుతుండగా.. ఆమె చేతిలో నుంచి చిన్నారి జారి కింద పడిపోయింది. వెంటనే కేకలు వేసి భర్తకు, తోటి ప్రయాణికులకు చెప్పింది.

ప్రయాణికులు రైలులో గొలుసు లాగి ఆపేశారు. బాధితులు తమ పాప ఆచూకీ కోసం రైలు పట్టాలపై పరుగులు తీస్తూ గాలింపు చేపట్టారు. ఆచూకీ లభించక పోవడంతో రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై బాలాజీనాయక్, తమ సిబ్బందితో కలిసి చిన్నారి మృతదేహన్ని కనుగొన్నారు. అనంతరం అంబులెన్స్ లో మృతదేహన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ చిన్నారి మృతదేహాన్ని చూసి... తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలకు శంఖారావం నేడే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.