ETV Bharat / state

శ్మశానానికి లేని దారి..ఆందోళనకు దిగిన ప్రజలు

author img

By

Published : Oct 23, 2021, 3:40 PM IST

ఎన్నేళ్లు బతికినా అందరూ చివరకు చేరేది శ్మశానానికే.. జీవితంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించి.. చివరకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలన్నా ఆ గ్రామంలో కష్టాలే.. గతంలో శ్మశానానికి వెళ్లే దారి ఉండగా.. కొంతమంది ఆ దారిని మూసివేయడం వల్ల గొడవకు దారి తీసింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

burial ground road controversy in anantapuram district
burial ground road controversy in anantapuram district

శ్మశానవాటికికు వెళ్లే దారిని కొందరు మూసివేయటంతో మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన అనంతపురం జిల్లా బీకేఎస్ మండలం జంతులూరులో చోటు చేసుకుంది. గ్రామంలో ఓ కాలనీ మీదుగా శ్మశానానికి దారి ఉండేది. ఈ మధ్య కొందరు ఆ దారిని మూసివేశారు. ఈ విషయంలో కాలనీలోని ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది.

ఇవాళ ఓ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. శ్మశానానికి వెళ్లే దారి మూసివేయడం వల్ల బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెసుకున్న తహసీల్దార్ అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. సమస్యను పరిష్కారిస్తానని ఆయన చెప్పారు.

శ్మశానవాటికికు వెళ్లే దారిని కొందరు మూసివేయటంతో మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన అనంతపురం జిల్లా బీకేఎస్ మండలం జంతులూరులో చోటు చేసుకుంది. గ్రామంలో ఓ కాలనీ మీదుగా శ్మశానానికి దారి ఉండేది. ఈ మధ్య కొందరు ఆ దారిని మూసివేశారు. ఈ విషయంలో కాలనీలోని ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది.

ఇవాళ ఓ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. శ్మశానానికి వెళ్లే దారి మూసివేయడం వల్ల బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెసుకున్న తహసీల్దార్ అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. సమస్యను పరిష్కారిస్తానని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:

liquor seized : అనంతపురం జిల్లాలో కర్ణాటక మద్యం పట్టివేత.. ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.