ఇదీ చూడండి:
'పోలవరం రివర్స్ టెండరింగ్తో రైతులకు వేల కోట్ల నష్టం' - ఏపీలో భాజపా సంకల్ప యాత్ర
పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ మొండి వైఖరి అవలంబిస్తున్నారని భాజపా ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. ఈ పద్ధతి వల్ల రైతులు వేల కోట్ల నష్టపోయే ప్రమాదముందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై విమర్శలు సంధించారు.
'పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల రైతులు వేల కోట్లు నష్టపోతున్నారు'
పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ వల్ల రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉందని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో మాట్లాడిన ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలపై మండిపడ్డారు. సీఎం జగన్ మొండి వైఖరి విడనాడాలని సూచించారు. హంద్రినీవా పనులు ఎందుకు నిలిపేశారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రైతులకు ఇస్తోన్న ఆరు వేల రూపాయలను.. జగన్ తానే ఇస్తున్నట్లుగా చెబుతున్నారని మరో నేత విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నట్లు భాజపా నేతలు తెలిపారు.
ఇదీ చూడండి:
sample description