పట్టణంలోని పప్పూరు రామాచార్యుల విగ్రహం వద్ద పీడీఎస్యూ, పట్టణ పేదల సంఘం నాయకులు నిరసనకు దిగారు. వైకాపా ప్రభుత్వం రాయలసీమ ప్రాంత ప్రజలపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. విభజన హామీలలో భాగంగా ఎయిమ్స్ తరహా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
కోస్తాంధ్రతో పాటు సమానంగా శాసనసభ స్థానాలను పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని తెలిపారు. రాయలసీమ హక్కుల పత్రంలోని మిగిలిన అంశాలను అమలు చేయాలన్నారు.
ఇదీ చదవండి: