ETV Bharat / state

'మహిళలు అభివృద్ధి చెందితేనే... రాష్ట్రం ముందుకెళ్తుంది'

author img

By

Published : Dec 31, 2019, 8:37 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం హెడ్ డిజిటల్ వర్క్స్​ సంస్థ సహకారంతో మహిళలకు కుట్టు శిక్షణా తరగతులు ప్రారంభించారు. గుంతకల్లులో దశాబ్దాల క్రితం మూతపడిన స్పిన్నింగ్​ మిల్లును పునఃప్రారంభించేలా చూస్తామని ఎంపీ తలారి రంగయ్య అన్నారు.

ananthapuram MP on women
మహిళలకు కుట్టు శిక్షణా తరగతులు ప్రారంభించిన ఎంపీ
మహిళలకు కుట్టు శిక్షణా తరగతులు ప్రారంభించిన ఎంపీ

అనంతపురం జిల్లా గుంతకల్లులో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం మహిళలకు కుట్టు శిక్షణా తరగతులను ప్రారంభించారు. "హెడ్ డిజిటల్ వర్క్స్​" సంస్థ సహకారంతో స్థానిక మార్కెట్ యార్డులో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వై.వెంకటారామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది మహిళలు పాల్గొన్నారు. మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఎంపీ అన్నారు. గుంతకల్లులో దశాబ్దాల క్రితం మూతపడిన స్పిన్నింగ్ మిల్లును పున:ప్రారంభించేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో టెక్స్​టైల్​ పార్కు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు.

మహిళలకు కుట్టు శిక్షణా తరగతులు ప్రారంభించిన ఎంపీ

అనంతపురం జిల్లా గుంతకల్లులో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం మహిళలకు కుట్టు శిక్షణా తరగతులను ప్రారంభించారు. "హెడ్ డిజిటల్ వర్క్స్​" సంస్థ సహకారంతో స్థానిక మార్కెట్ యార్డులో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వై.వెంకటారామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది మహిళలు పాల్గొన్నారు. మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఎంపీ అన్నారు. గుంతకల్లులో దశాబ్దాల క్రితం మూతపడిన స్పిన్నింగ్ మిల్లును పున:ప్రారంభించేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో టెక్స్​టైల్​ పార్కు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు.

ఇదీ చదవండి:

ఇళ్లూ... కార్లూ... ఏవీ వదలకుండా..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.