అనంతపురం జిల్లా గుంతకల్లులో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం మహిళలకు కుట్టు శిక్షణా తరగతులను ప్రారంభించారు. "హెడ్ డిజిటల్ వర్క్స్" సంస్థ సహకారంతో స్థానిక మార్కెట్ యార్డులో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వై.వెంకటారామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది మహిళలు పాల్గొన్నారు. మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఎంపీ అన్నారు. గుంతకల్లులో దశాబ్దాల క్రితం మూతపడిన స్పిన్నింగ్ మిల్లును పున:ప్రారంభించేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు.
ఇదీ చదవండి: