ETV Bharat / state

ఆరుపదుల వయసు.. గేట్‌ పరీక్షలో టాప్ ర్యాంకు..!

author img

By

Published : Mar 19, 2022, 9:51 AM IST

Retired Employee cracks gate: చదువుకు వయసు అడ్డుకాదని మరోసారి నిరూపించారు.. ఓ రిటైర్డ్ ఉద్యోగి. ఆరు పదుల వయసులో.. గేట్‌ పరీక్షలో జాతీయస్థాయిలో 140వ ర్యాంకు సాధించి ఔరా అనిపించారు అనంతపురం జిల్లాకు చెందిన వి.సత్యనారాయణరెడ్డి!

anantapur Retired Employee cracks gate exam
ఆరుపదుల వయసు.. గేట్‌ పరీక్షలో టాప్ ర్యాంకు

Retired Employee cracks gate: ఉన్నత చదువులకు వయసు అడ్డుకాదు. ఉద్యోగం చేస్తూ కూడా చదివేవారు ఎందరో ఉన్నారు. కానీ, ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా ఉన్నత చదువులు అభ్యసించేవారు మాత్రం అరుదు. అనంతపురం నగరానికి చెందిన వి.సత్యనారాయణరెడ్డి ఇంజినీరుగా ఉద్యోగ విరమణ చేసిన తరువాత జేఎన్‌టీయూలో ఎంటెక్‌ చేశారు. గేట్‌ పరీక్షలో జాతీయస్థాయిలో 140వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నారు.

పంచాయతీరాజ్‌ శాఖలో ఇంజినీరుగా 39 ఏళ్లు పనిచేశారు. డీఈఈగా 2018లో ఉద్యోగ విరమణ చేశారు. 2019లో జేఎన్‌టీయూ సివిల్‌ విభాగంలో ఎంటెక్‌లో చేరి 2022లో పూర్తి చేశారు. 2022 గేట్‌ పరీక్షలోని జియోమోటిక్స్‌ ఇంజినీరింగ్‌ పేపరులో 140వ ర్యాంకు సాధించారు. ఆయన వయసు ప్రస్తుతం 64 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.

గేట్‌ సాధించిన అభ్యర్థులు ఉన్నత విద్యలో ప్రవేశానికి 3 సంవత్సరాలపాటు అవకాశం ఉంటుందని సత్యనారాయణ తెలిపారు. కుటుంబసభ్యులతో చర్చించి బాంబే లేదా రౌర్కెలాలోని ఐఐటీలో జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌), రిమోట్‌ సెన్సింగ్‌ కోర్సులో చేరాలని భావిస్తున్నట్లు వివరించారు.

Retired Employee cracks gate: ఉన్నత చదువులకు వయసు అడ్డుకాదు. ఉద్యోగం చేస్తూ కూడా చదివేవారు ఎందరో ఉన్నారు. కానీ, ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా ఉన్నత చదువులు అభ్యసించేవారు మాత్రం అరుదు. అనంతపురం నగరానికి చెందిన వి.సత్యనారాయణరెడ్డి ఇంజినీరుగా ఉద్యోగ విరమణ చేసిన తరువాత జేఎన్‌టీయూలో ఎంటెక్‌ చేశారు. గేట్‌ పరీక్షలో జాతీయస్థాయిలో 140వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నారు.

పంచాయతీరాజ్‌ శాఖలో ఇంజినీరుగా 39 ఏళ్లు పనిచేశారు. డీఈఈగా 2018లో ఉద్యోగ విరమణ చేశారు. 2019లో జేఎన్‌టీయూ సివిల్‌ విభాగంలో ఎంటెక్‌లో చేరి 2022లో పూర్తి చేశారు. 2022 గేట్‌ పరీక్షలోని జియోమోటిక్స్‌ ఇంజినీరింగ్‌ పేపరులో 140వ ర్యాంకు సాధించారు. ఆయన వయసు ప్రస్తుతం 64 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.

గేట్‌ సాధించిన అభ్యర్థులు ఉన్నత విద్యలో ప్రవేశానికి 3 సంవత్సరాలపాటు అవకాశం ఉంటుందని సత్యనారాయణ తెలిపారు. కుటుంబసభ్యులతో చర్చించి బాంబే లేదా రౌర్కెలాలోని ఐఐటీలో జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐఎస్‌), రిమోట్‌ సెన్సింగ్‌ కోర్సులో చేరాలని భావిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి:

biometric: ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్​ హాజరు.. అప్పట్నుంచే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.