అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై.రాంపురంలో ఓ వ్యక్తిని కొందరు దుండగులు రాత్రి హత్య చేశారు. ఉదయం విషయం గమనించిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలించారు. ద్విచక్రవాహనంపై కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న వన్నూరుస్వామిని అడ్డగించి కర్రలు, రాళ్లతో దాడి చేసి హతమార్చినట్లు ఆనవాళ్లు గుర్తించారు. మృతుడు.. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామవాసిగా గుర్తించినట్లు ఎస్సై రమేశ్ రెడ్డి తెలిపారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: విషాదం: అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి