ETV Bharat / state

'అన్నదాతలకు దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు'

రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు దేవాలయాలుగా మారతాయని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యానించారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ఆయన... కేంద్ర ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైకాపా షరతులతో కూడిన మద్దతు తెలిపిందన్నారు.

author img

By

Published : Dec 8, 2020, 4:14 PM IST

అన్నదాతలకు దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు
అన్నదాతలకు దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు

రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యనించారు. అనంతపురంలో పర్యటించిన ఆయన... వైకాపా ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు దేవాలయాలుగా మారతాయని చెప్పారు. పార్లమెంట్​లో కేంద్ర ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైకాపా షరతులతో కూడిన మద్దతు తెలిపిందని గుర్తుచేశారు.

రైతులకు మద్దతు తెలపడానికే రాష్ట్రంలో ఇవాళ బంద్​కు పిలుపునిచ్చామన్నారు. గత 18 నెలల కాలంలో మైనార్టీల అభివృద్ధి కోసం రూ. 3,700 కోట్లు ఖర్చుచేశామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రజల సంక్షేమ కోసం వైకాపా నిరంతరం కృషిచేస్తోందని తెలిపారు.

రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా వ్యాఖ్యనించారు. అనంతపురంలో పర్యటించిన ఆయన... వైకాపా ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు దేవాలయాలుగా మారతాయని చెప్పారు. పార్లమెంట్​లో కేంద్ర ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వైకాపా షరతులతో కూడిన మద్దతు తెలిపిందని గుర్తుచేశారు.

రైతులకు మద్దతు తెలపడానికే రాష్ట్రంలో ఇవాళ బంద్​కు పిలుపునిచ్చామన్నారు. గత 18 నెలల కాలంలో మైనార్టీల అభివృద్ధి కోసం రూ. 3,700 కోట్లు ఖర్చుచేశామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రజల సంక్షేమ కోసం వైకాపా నిరంతరం కృషిచేస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి:

భారత్ బంద్​తో.. సచివాలయం నిర్మానుష్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.