ETV Bharat / sports

ఐపీఎల్​ ప్రారంభ మ్యాచ్​లకు ఆ స్టార్స్​ దూరం!

author img

By

Published : Feb 9, 2022, 4:53 PM IST

Updated : Feb 10, 2022, 11:19 AM IST

IPL 2022 Warner: ఈ సీజన్​ ఐపీఎల్​ ప్రారంభ మ్యాచ్​లకు కొంతమంది విదేశీ స్టార్​ ఆటగాళ్లు దూరం కానున్నట్లు తెలిసింది. ఇంతకీ ఆ ప్లేయర్స్​ ఎవరంటే?

warner out of IPL 2022 beginning
ఐపీఎల్​ 2022

IPL 2022 Warner: మరి కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ నిర్వహణ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులను నిరాశపరిచే ఓ వార్త బయటకు వచ్చింది. ​ఈ సీజన్​ ప్రారంభ మ్యాచ్​లకు చాలా మంది విదేశీ ప్లేయర్లు అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. వీరిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాట్​ కమిన్స్​, డేవిడ్​ వార్నర్​, స్టీవ్​ స్మిత్​, కగిసొ రబాడా(వెస్టిండీస్​), అన్రిచ్​ నోర్జే(దక్షిణాఫ్రికా), మార్కొ జాన్సన్​(దక్షిణాఫ్రికా) ఉన్నారని తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్​ కోసం వీరు దూరం కానున్నట్లు క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

ఏప్రిల్​ ప్రారంభంలో స్వదేశంలో ఐపీఎల్​ నిర్వహించాలని బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా.. పాకిస్థాన్​తో, దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్​తో సిరీస్​ ఆడనుంది. ఈ కారణంగా ఆ దేశ ఆటగాళ్లు తమ జట్టుకు అండగా ఉండేందుకు మెగాటోర్నీకి దూరంగా ఉండనున్నారని తెలిసింది. కాగా, ఈ సీజన్​ కోసం ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగావేలం నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది బీసీసీఐ.

IPL 2022 Warner: మరి కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ నిర్వహణ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులను నిరాశపరిచే ఓ వార్త బయటకు వచ్చింది. ​ఈ సీజన్​ ప్రారంభ మ్యాచ్​లకు చాలా మంది విదేశీ ప్లేయర్లు అందుబాటులో ఉండట్లేదని తెలిసింది. వీరిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాట్​ కమిన్స్​, డేవిడ్​ వార్నర్​, స్టీవ్​ స్మిత్​, కగిసొ రబాడా(వెస్టిండీస్​), అన్రిచ్​ నోర్జే(దక్షిణాఫ్రికా), మార్కొ జాన్సన్​(దక్షిణాఫ్రికా) ఉన్నారని తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్​ కోసం వీరు దూరం కానున్నట్లు క్రికెట్​ వర్గాలు తెలిపాయి.

ఏప్రిల్​ ప్రారంభంలో స్వదేశంలో ఐపీఎల్​ నిర్వహించాలని బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఆ సమయంలో ఆస్ట్రేలియా.. పాకిస్థాన్​తో, దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్​తో సిరీస్​ ఆడనుంది. ఈ కారణంగా ఆ దేశ ఆటగాళ్లు తమ జట్టుకు అండగా ఉండేందుకు మెగాటోర్నీకి దూరంగా ఉండనున్నారని తెలిసింది. కాగా, ఈ సీజన్​ కోసం ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగావేలం నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది బీసీసీఐ.

ఇదీ చూడండి: అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఫుట్​బాల్​ స్డేడియం!

Last Updated : Feb 10, 2022, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.