ETV Bharat / jagte-raho

ముగ్గురు మహిళలు అదృశ్యం.. ఇంకా దొరకని ఆచూకీ..

ముగ్గురు మహిళలు కనిపించకుండాపోయిన ఘటనలు తెలంగాణ మేడ్చల్​ జిల్లా దండిగల్​లో చోటుచేకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Sep 22, 2020, 11:57 PM IST

ముగ్గురు మహిళలు అదృశ్యం.. ఇంకా దొరకని ఆచూకీ..
ముగ్గురు మహిళలు అదృశ్యం.. ఇంకా దొరకని ఆచూకీ..

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ముగ్గురు మహిళలు అదృశ్యమయ్యారు. దుండిగల్​లో నివాసం ఉంటున్న హెచ్​. శిరీష అనే విద్యార్థి ఈనెల 19న ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సురారం రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే వై. భారతి(21) కొంపల్లిలో ఉద్యోగం చేస్తోంది. 20న ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.

బహుదూర్​పల్లి ఇందిరమ్మ కాలనీ చెందిన ఎమ్.పద్మావతి (38) 20వ తేదీన భర్తతో గొడవపడి, 21న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవటంతో భర్త లక్ష్మారెడ్డి దుండిగల్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలకు సంబంధించి ఫిర్యాదు స్వీకరించిన కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ముగ్గురు మహిళలు అదృశ్యమయ్యారు. దుండిగల్​లో నివాసం ఉంటున్న హెచ్​. శిరీష అనే విద్యార్థి ఈనెల 19న ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. సురారం రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే వై. భారతి(21) కొంపల్లిలో ఉద్యోగం చేస్తోంది. 20న ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.

బహుదూర్​పల్లి ఇందిరమ్మ కాలనీ చెందిన ఎమ్.పద్మావతి (38) 20వ తేదీన భర్తతో గొడవపడి, 21న ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవటంతో భర్త లక్ష్మారెడ్డి దుండిగల్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలకు సంబంధించి ఫిర్యాదు స్వీకరించిన కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.