ETV Bharat / jagte-raho

ఫైనాన్స్​ సంస్థలో బంగారం స్కాం... పోలీసుల దర్యాప్తు ముమ్మరం - విజయవాడలో ముత్తూట్ ఫైనాన్స్‌లో బంగారం స్కాం

ఓ ఫైనాన్స్‌ సంస్థలో వెలుగు చూసిన బంగారం కుంభకోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడు వీరబాబు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులకు సమాచారం అందింది. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడికి సహకరించిన ముగ్గురు సిబ్బందిని విచారించారు. సుమారు రూ.కోటి 90 లక్షల విలువ చేసే బంగారం కాజేసినట్లు గుర్తించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Muthoot  Manager
Muthoot Manager
author img

By

Published : Nov 21, 2020, 10:34 AM IST

ఎదుటి వారి బలహీనత.. నమ్మకమే మోసగాళ్లకు పెట్టుబడి. సరిగ్గా ఇదే సూత్రాన్ని వినియోగించి రూ. కోటిన్నరకు పైగా విలువచేసే బంగారాన్ని మాయం చేశాడు ఓ ప్రైవేట్ బ్రాంచ్ మేనేజర్. బంగారం మీ ఇంట్లో ఉంటే ఏం వస్తుంది.. లాకర్​లో పెడితే గోల్డ్ కాయిన్ వస్తుందని వినియోగదారులను నమ్మించి బంగారం తీసుకున్నాడు. గోల్డ్ కాయిన్ ఇవ్వాలని బాధితులు కోరితే కుంటి సాకులతో రోజులు గడుపుతూ.. అవకాశం రాగానే ఉడాయించాడు. అనుమానం వచ్చిన బాధితులు సదరు ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ నూతన మేనేజర్​ను నిలదీశారు. ఆయన తీగ లాగితే.. గోల్డ్ స్కాం గుట్టంతా బయటపడింది. ఈ కేసును పోలీసులు సవాల్​గా తీసుకున్నారు.

విజయవాడ పటమటలో జరిగిన ఈ ఘటనపై.. దర్యాప్తు ముమ్మరం చేశారు. వీరబాబు అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. అతణ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సహకరించిన ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తుల నుంచి సుమారు కోటి 90 లక్షల రూపాయల విలువ చేసే బంగారం వీరబాబుకు అందినట్లు గుర్తించారు. ఏడాది నుంచి బంగారం లాకర్‌లో పెట్టాలని మేనేజర్ తమ చుట్టూ తిరుగుతున్నట్లు బాధితులు తెలిపారు. తమ నగదు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఎదుటి వారి బలహీనత.. నమ్మకమే మోసగాళ్లకు పెట్టుబడి. సరిగ్గా ఇదే సూత్రాన్ని వినియోగించి రూ. కోటిన్నరకు పైగా విలువచేసే బంగారాన్ని మాయం చేశాడు ఓ ప్రైవేట్ బ్రాంచ్ మేనేజర్. బంగారం మీ ఇంట్లో ఉంటే ఏం వస్తుంది.. లాకర్​లో పెడితే గోల్డ్ కాయిన్ వస్తుందని వినియోగదారులను నమ్మించి బంగారం తీసుకున్నాడు. గోల్డ్ కాయిన్ ఇవ్వాలని బాధితులు కోరితే కుంటి సాకులతో రోజులు గడుపుతూ.. అవకాశం రాగానే ఉడాయించాడు. అనుమానం వచ్చిన బాధితులు సదరు ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ నూతన మేనేజర్​ను నిలదీశారు. ఆయన తీగ లాగితే.. గోల్డ్ స్కాం గుట్టంతా బయటపడింది. ఈ కేసును పోలీసులు సవాల్​గా తీసుకున్నారు.

విజయవాడ పటమటలో జరిగిన ఈ ఘటనపై.. దర్యాప్తు ముమ్మరం చేశారు. వీరబాబు అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. అతణ్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సహకరించిన ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తుల నుంచి సుమారు కోటి 90 లక్షల రూపాయల విలువ చేసే బంగారం వీరబాబుకు అందినట్లు గుర్తించారు. ఏడాది నుంచి బంగారం లాకర్‌లో పెట్టాలని మేనేజర్ తమ చుట్టూ తిరుగుతున్నట్లు బాధితులు తెలిపారు. తమ నగదు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:

2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.