ETV Bharat / jagte-raho

తెలంగాణ: భర్త గురుమూర్తి సహకారంతో 100 కోట్ల అక్రమాస్తులు

author img

By

Published : Dec 6, 2019, 12:56 PM IST

ఐఎంఎస్  కుంభకోణం  ప్రధాన  సూత్రధారి దేవికా రాణి  100  కోట్ల ఆస్తులు  కూడబెట్టారు. పక్క సమాచారంతో  అవినీతి నిరోధక శాఖ అధికారులు  ఆస్తుల  చిట్టాను  బయటపెట్టారు. దేవికారాణి.. తన భర్త గురుమూర్తి సహకారంతో  పలుచోట్ల స్థిరచరాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. గురుమూర్తిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

devikarani-husband-gurumurthi-arrest-in-ims-scam
devikarani-husband-gurumurthi-arrest-in-ims-scam

బీమా వైద్య సేవల కుంభకోణంలో అక్రమాలకు పాల్పడిన దేవికా రాణి భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆమె భర్త, సివిల్ సర్జన్​గా పదవీ విరమణ పొందిన గురుమూర్తి సహకారంతో స్థిరచరాస్తులు కొనుగోలు చేసినట్లు అనిశా అధికారులు తేల్చారు. దేవికారాణి తరఫున ఔషధ పరిశ్రమల నుంచి లంచాలు తీసుకున్న గురుమూర్తి.. స్థిరాస్తులు కొనుగోలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో దేవికా రాణి కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది. పక్కా సమాచారంతో రెండు రోజుల క్రితం హైదరాబాద్, కడప, తిరుపతిలో దేవికా రాణి కుటుంబ సభ్యుల ఇళ్లల్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించి.. ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

కోట్లకు పైగా ఆస్తులు..

బహుళ అంతస్థుల భవనాల్లో ఫ్లాట్లు, 32 ఎకరాల పొలం, తెలుగు రాష్ట్రాల్లో 11 ఇంటి స్థలాలు, వైజాగ్​లో సొంత ఇల్లు, హైదరాబాద్​లో 16 వాణిజ్య దుకాణాలున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. 23 బ్యాంకు ఖాతాల్లో కోటి 13లక్షల నగదు, నారాయణగూడలోని ఇండియన్ బ్యాంకులో 34 లక్షల డిపాజిట్, నిర్మాణ రంగంలో 6. 63 కోట్ల పెట్టుబడులు, ఇంట్లో 8 లక్షల నగదు గుర్తించారు. షేక్ పేటలో దేవికా రాణి నివాసం ఉంటున్న విల్లా విలువ 3.8 కోట్లు. షేక్ పేటలోనే ఆదిత్య టవర్స్​లో ఉన్న మూడు ఫ్లాట్ల విలువ 2.65 కోట్లు. దేవికారాణి ఇంటి అలంకరణ వస్తువుల విలువ 38 లక్షలు, 26 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 7లక్షల ఎలక్ట్రానిక్​ పరికరాలు, 20 లక్షలు విలువ చేసే ఇన్నోవా కారు, ద్విచక్ర వాహనం గుర్తించారు. సోమాజీగూడలో ఫ్లాటు, రాజేంద్రనగర్ లో సొంత ఇల్లు ఉన్నట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవికా రాణి భర్త గురుమూర్తిని అనిశా అధికారులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించారు.

19కు నిందితుల సంఖ్య:

దేవికా రాణి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో నగదు సుమారు 8 కోట్లు ఉండగా.. స్థిరాస్తులు డాక్యుమెంట్ల విలువ ప్రకారం 15 కోట్లుగా ఉందని అనిశా అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్​లో ప్రస్తుత విలువ ప్రకారం స్థిరాస్తుల విలువ 100 కోట్ల వరకు ఉంటుందని అనిశా అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ప్రధాన సూత్రధారిగా ఉన్న దేవికారాణి చంచల్ గూడ మహిళా జైల్లో జ్యూడిషియల్ ఖైదీగా ఉన్నారు. ఆమెతో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె భర్తను కూడా అరెస్ట్ చేయడం వల్ల సంఖ్య 19కి చేరింది. దేవికారాణిని, ఆమె భర్తను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని అనిశా అధికారులు భావిస్తున్నారు.

బీమా వైద్య సేవల కుంభకోణంలో అక్రమాలకు పాల్పడిన దేవికా రాణి భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆమె భర్త, సివిల్ సర్జన్​గా పదవీ విరమణ పొందిన గురుమూర్తి సహకారంతో స్థిరచరాస్తులు కొనుగోలు చేసినట్లు అనిశా అధికారులు తేల్చారు. దేవికారాణి తరఫున ఔషధ పరిశ్రమల నుంచి లంచాలు తీసుకున్న గురుమూర్తి.. స్థిరాస్తులు కొనుగోలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో దేవికా రాణి కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది. పక్కా సమాచారంతో రెండు రోజుల క్రితం హైదరాబాద్, కడప, తిరుపతిలో దేవికా రాణి కుటుంబ సభ్యుల ఇళ్లల్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించి.. ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

కోట్లకు పైగా ఆస్తులు..

బహుళ అంతస్థుల భవనాల్లో ఫ్లాట్లు, 32 ఎకరాల పొలం, తెలుగు రాష్ట్రాల్లో 11 ఇంటి స్థలాలు, వైజాగ్​లో సొంత ఇల్లు, హైదరాబాద్​లో 16 వాణిజ్య దుకాణాలున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. 23 బ్యాంకు ఖాతాల్లో కోటి 13లక్షల నగదు, నారాయణగూడలోని ఇండియన్ బ్యాంకులో 34 లక్షల డిపాజిట్, నిర్మాణ రంగంలో 6. 63 కోట్ల పెట్టుబడులు, ఇంట్లో 8 లక్షల నగదు గుర్తించారు. షేక్ పేటలో దేవికా రాణి నివాసం ఉంటున్న విల్లా విలువ 3.8 కోట్లు. షేక్ పేటలోనే ఆదిత్య టవర్స్​లో ఉన్న మూడు ఫ్లాట్ల విలువ 2.65 కోట్లు. దేవికారాణి ఇంటి అలంకరణ వస్తువుల విలువ 38 లక్షలు, 26 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 7లక్షల ఎలక్ట్రానిక్​ పరికరాలు, 20 లక్షలు విలువ చేసే ఇన్నోవా కారు, ద్విచక్ర వాహనం గుర్తించారు. సోమాజీగూడలో ఫ్లాటు, రాజేంద్రనగర్ లో సొంత ఇల్లు ఉన్నట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవికా రాణి భర్త గురుమూర్తిని అనిశా అధికారులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాలతో చంచల్ గూడ జైలుకు తరలించారు.

19కు నిందితుల సంఖ్య:

దేవికా రాణి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో నగదు సుమారు 8 కోట్లు ఉండగా.. స్థిరాస్తులు డాక్యుమెంట్ల విలువ ప్రకారం 15 కోట్లుగా ఉందని అనిశా అధికారులు తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్​లో ప్రస్తుత విలువ ప్రకారం స్థిరాస్తుల విలువ 100 కోట్ల వరకు ఉంటుందని అనిశా అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ప్రధాన సూత్రధారిగా ఉన్న దేవికారాణి చంచల్ గూడ మహిళా జైల్లో జ్యూడిషియల్ ఖైదీగా ఉన్నారు. ఆమెతో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె భర్తను కూడా అరెస్ట్ చేయడం వల్ల సంఖ్య 19కి చేరింది. దేవికారాణిని, ఆమె భర్తను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని అనిశా అధికారులు భావిస్తున్నారు.

TG_HYD_47_05_IMS_DEVIKARANI_CASE_PKG_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ ( ) ఐఎంఎస్ కుంభకోణం ప్రధాన సూత్రధారి దేవికా రాణి 100 కోట్ల ఆస్తులు కూడబెట్టారు. పక్క సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖాధికారులు ఆస్తుల చిట్టాను బయటపెట్టారు. భర్త గురుమూర్తి సహకారంతో పలుచోట్ల స్థిరచరాస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అనిశా అధికారులు దేవికారాణి, గురుమూర్తిలపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. గురుమూర్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు......LOOK V.O- బీమా వైద్య సేవల కుంభకోణంలో వందల కోట్ల అక్రమాలకు కారణమైన దేవికా రాణి భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆమె భర్త, సివిల్ సర్జన్ గా పదవీ విరమణ పొందిన గురుమూర్తి సహకారంతో స్థిరచరాస్తులు కొనుగోలు చేశారు. సివిల్ సర్జన్ గా పదవీ విరమణ పొందిన గురుమూర్తి... దేవికా రాణి అక్రమాలకు సహకరించినట్లు అనిశా అధికారులు తేల్చారు. దేవికారాణి తరఫున ఔషధ పరిశ్రమల నుంచి లంచాలు తీసుకున్న గురుమూర్తి.... స్థిరాస్తులు కొనుగోలు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో దేవికా రాణి కుటుంబ సభ్యుల పేరుమీద ఆస్తులున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు రెండు రోజుల క్రితం హైదరాబాద్, కడప, తిరుపతిలో దేవికా రాణి కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన అనిశా అధికారులు... ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బహుళ అంతస్థుల భవనాల్లో ఫ్లాట్లు, 32 ఎకరాల పొలం, తెలుగు రాష్ట్రాల్లో 11 ఇంటి స్థలాలు, వైజాగ్ లో సొంత ఇల్లు, హైదరాబాద్ లో 16 వాణిజ్య దుకాణాలున్నట్లు అనిశా అధికారులు గుర్తించారు. 23 బ్యాంకు ఖాతాల్లో కోటి 13లక్షల నగదు, నారాయణగూడలోని ఇండియన్ బ్యాంకులో 34 లక్షల డిపాజిట్, నిర్మాణ రంగంలో 6.63కోట్ల పెట్టుబడులు, ఇంట్లో 8లక్షల నగదు గుర్తించారు. షేక్ పేటలో దేవికా రాణి నివాసం ఉంటున్న విల్లా విలువ 3.8కోట్లు. షేక్ పేటలోనే ఆదిత్య టవర్స్ లో ఉన్న మూడు ఫ్లాట్ల విలువ 2.65కోట్లు. దేవికారాణి ఇంటి అలంకరణ వస్తువుల విలువ 38 లక్షలు, 26లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 7లక్షల రూపాయల ఎలక్ర్టానిక్ పరికరాలు, 20 లక్షల రూపాయల విలువ చేసే ఇన్నోవా కారు, ద్విచక్ర వాహనం గుర్తించారు. సోమాజీగూడలో ఫ్లాటు, రాజేంద్రనగర్ లో సొంత ఇల్లు ఉన్నట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దేవికా రాణి భర్త గురుమూర్తిని అరెస్ట్ చేసిన అనిశా అధికారులు న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించారు. V.O- దేవికా రాణి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో నగదు సుమారు 8 కోట్లు ఉండగా.. స్థిరాస్తులు డాక్యుమెంట్ల విలువ ప్రకారం 15కోట్లుగా ఉందని అనిశా అధికారులు తెలిపారు. కానీ బహిరంగ మార్కెట్ లో ప్రస్తుత విలువ ప్రకారం స్థిరాస్తుల విలువ 100 కోట్ల వరకు ఉంటుందని అనిశా అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఐఎంఎస్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న దేవికారాణి చంచల్ గూడ మహిళా జైల్లో జ్యూడిషియల్ ఖైదీగా ఉన్నారు. ఆమెతో పాటు ఐఎంఎస్ కుంభకోణంలో 18 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె భర్తను కూడా అరెస్ట్ చేయడంతో సంఖ్య 19కి చేరింది. బీమా వైద్య సేవల విభాగం సంయుక్త సంచాలకులు పద్మ, సహాయ సంచాలకులు ఇందిరతో పాటు.... అందులో పనిచేసే ఉద్యోగులు, ఔషధ పరిశ్రమలకు చెందిన యజమానులు, ప్రతినిధులను అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమాల్లో కీలక పాత్ర పోషించిన వాళ్లను దఫాలుగా కస్టడీలోకి తీసుకున్న అనిశా అధికారులు వాళ్లిచ్చిన సమాచారం మేరకు కుంభకోణానికి సంబంధించిన సమాచారం సేకరించారు. అవసరం లేకున్నా ఔషధాలు కొనుగోలు చేయడం, అర్హత లేని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టడం, నిర్దేశించిన ధర కంటే ఎక్కువ చెల్లించడం, ఔషధాలు, రోగ నిర్ధారణ కిట్ లను ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ లలో విక్రయించటం లాంటి అక్రమాలకు పాల్పడినట్లు అనిశా తేల్చింది. E.V.O- ఇప్పటికే ఐఎంఎస్ కుంభకోణంలో దేవికారాణి చంచల్ గూడ మహిళా జైల్లో జ్యూడిషియల్ ఖైదీగా ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెతో పాటు ఆమె భర్త గురుమూర్తిపైనా కేసు నమోదు చేసిన అనిశా అధికారులు... గురుమూర్తిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ కేసులోనూ దేవికారాణిని, ఆమె భర్తను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తే అక్రమాస్తులకు సంబంధించి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని అనిశా అధికారులు భావిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.