ETV Bharat / jagte-raho

ప్రియురాలి శరీరాన్ని కట్టర్​తో కట్ చేసి.. గోనెసంచిలో కుక్కి..!

author img

By

Published : Nov 10, 2020, 4:32 PM IST

రెండున్నర ఏళ్ల కిందట బీటెక్ విద్యార్థిని నజీమా అదృశ్యమైంది. అప్పటినుంచి కేసును ఛేదించే పనిలో పడ్డ పోలీసులు.. తాజాగా చిక్కుముడిని విప్పారు. అయితే ఆ విద్యార్థిని అదృశ్యానికి కారణాలు, చంపేసిన విధానాన్ని తెలుసుకుని పోలీసులే షాకయ్యారు. ప్రేమించిన వ్యక్తే.. ఆ యువతిపాలిట యముడిగా మారాడు.

ప్రియురాలి శరీరాన్ని కట్టర్​తో కట్ చేసి.. గోనే సంచిలో కుక్కి..!
ప్రియురాలి శరీరాన్ని కట్టర్​తో కట్ చేసి.. గోనే సంచిలో కుక్కి..!

గుంటూరు అలీనగర్ ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థిని నజీమా అదృశ్యం కేసు విషాదాంతంగా మిగిలింది. 2018 మే 25న వివాహానికి వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరింది. ఆపై మళ్లీ ఇంటికి రాలేదు. ఆమె కోసం తల్లిదండ్రులు కరీముల్లా, తల్లి మీరా బీ, బంధువులు గాలించి విఫలమై... చివరకు పాతగుంటూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కొన్నాళ్లు వెతికిన తర్వాత పోలీసులు కేసును పక్కన పెట్టేశారు. తమ బిడ్డ ఏమైందోనని ఆందోళనతో ఆ కన్నవారు నిద్రలేని రాత్రులు గడిపారు. ఏనాడైనా కంటికి కనిపిస్తుందని ఆశతో ఎదురుచూపులు చూశారు. గాలిస్తూనే ఉన్నామని పోలీసులు చెప్పేవారు. ఇలా రెండున్నరేళ్లు భారంగా గడిచిపోయాయి.

తేలింది ఇలా...

ఇన్నాళ్ల తరువాత వచ్చిన ఓ కీలక సమాచారంతో పెండింగ్​ మిస్టరీ కేసు విషయాన్ని గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. స్పందించిన ఐజీ వెంటనే విచారణకు ఆదేశించారు. ఆమెతో సన్నిహిత సంబంధాలున్నట్లు అనుమానించిన పోలీసులు... షేక్ కరీమ్​ అలియాన్ నాగూర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గట్టిగా నిలదీయడంతో హత్యోదంతం బయటపడింది.

ఈ కథే ఘోరానికి కారణం

నజీమా, షేక్ కరీమ్​.. కళాశాలలోనే ప్రేమించుకున్నారు. శారీరకంగా దగ్గరయ్యారు. ఈలోగా ఇద్దరి మధ్య అనుమానాలు, అభిప్రాయభేదాలు తలెత్తాయి. కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. వేరొకరితో నజీమా చనువుగా ఉందనే అనుమానం పెంచుకున్న నాగూర్... ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. ఆమె ఒత్తిడి చేయడంతో... చివరకు ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఒకరోజు ఇద్దరూ కలుసుకున్నారు. అక్కడా నజీమా పెళ్లి ప్రస్తావన తేవడం, చిన్నపాటి గొడవ తలెత్తడంతో ఆగ్రహంతో నజీమా గొంతు నులిమేశాడు.. గోడకేసి కొట్టి హత్య చేసినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.

కట్టర్​తో కట్ చేసి..

విషయం బయటకు తెలుస్తుందని... కట్టర్​తో ఆమె శరీర భాగాలను ముక్కలుముక్కలుగా చేశాడు. గోనెసంచిలో కుక్కి సుద్దపల్లిడొంక శివారులోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కాలిపోయిన స్థితిలో ఈ మృతదేహాన్ని గుర్తుపట్టని పోలీసులు.... ఫోరెన్సిక్ ల్యాబ్ లో మాత్రం డీఎన్ఏను భద్రపరిచారు. ఇన్నాళ్లకు నిందితుడిని విచారించడంతో ఘటనాస్థలిని చూపించడం... ఫోరెన్సిక్ ల్యాబ్​లోని డీఎన్ఏ... తల్లిదండ్రుల డీఎన్ఏతో సరిపోలడంతో చనిపోయింది నజీమానేనని నిర్ధారించారు. కచ్చితమైన సాక్ష్యాధారాలతో నిందితుడిని అరెస్టు చేశామని.... ఈ కేసులో మరెవరి పాత్ర లేదని ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.

అరెస్టు అనంతరం నిందితుడు షేక్ కరీం అలియాస్ నాగూర్​ను మీడియా ముందుపెట్టిన పోలీసులు... అతని వద్ద నుంచి కటింగ్ మిషన్, మృతురాలి ఆధార్ కార్డు, పెట్రోల్ బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఎందుకంత జాప్యం..?!

కాగా ఈ కేసులో అప్పటి పోలీసులు వహించిన పాత్ర చర్చనీయాంశమైంది. నిందితుడిని పట్టుకోవడంలో రెండున్నరేళ్లుగా జాప్యం జరగడం విమర్శలకు తావిచ్చింది. చివరకు తల్లిదండ్రులు ఐజీ త్రివిక్రమ వర్మను కలవకపోతే... ఆయన దర్యాప్తునకు ఆదేశించకపోతే.. నజీమా హత్య కేసు మిస్టరీగానే మిగిలేది.

ఇదీ చదవండి: టచ్ ఫోన్​కు ఆశపడ్డాడు.. కటకటాల పాలయ్యాడు

గుంటూరు అలీనగర్ ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థిని నజీమా అదృశ్యం కేసు విషాదాంతంగా మిగిలింది. 2018 మే 25న వివాహానికి వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరింది. ఆపై మళ్లీ ఇంటికి రాలేదు. ఆమె కోసం తల్లిదండ్రులు కరీముల్లా, తల్లి మీరా బీ, బంధువులు గాలించి విఫలమై... చివరకు పాతగుంటూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కొన్నాళ్లు వెతికిన తర్వాత పోలీసులు కేసును పక్కన పెట్టేశారు. తమ బిడ్డ ఏమైందోనని ఆందోళనతో ఆ కన్నవారు నిద్రలేని రాత్రులు గడిపారు. ఏనాడైనా కంటికి కనిపిస్తుందని ఆశతో ఎదురుచూపులు చూశారు. గాలిస్తూనే ఉన్నామని పోలీసులు చెప్పేవారు. ఇలా రెండున్నరేళ్లు భారంగా గడిచిపోయాయి.

తేలింది ఇలా...

ఇన్నాళ్ల తరువాత వచ్చిన ఓ కీలక సమాచారంతో పెండింగ్​ మిస్టరీ కేసు విషయాన్ని గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ దృష్టికి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. స్పందించిన ఐజీ వెంటనే విచారణకు ఆదేశించారు. ఆమెతో సన్నిహిత సంబంధాలున్నట్లు అనుమానించిన పోలీసులు... షేక్ కరీమ్​ అలియాన్ నాగూర్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గట్టిగా నిలదీయడంతో హత్యోదంతం బయటపడింది.

ఈ కథే ఘోరానికి కారణం

నజీమా, షేక్ కరీమ్​.. కళాశాలలోనే ప్రేమించుకున్నారు. శారీరకంగా దగ్గరయ్యారు. ఈలోగా ఇద్దరి మధ్య అనుమానాలు, అభిప్రాయభేదాలు తలెత్తాయి. కొన్నాళ్లు దూరంగా ఉన్నారు. వేరొకరితో నజీమా చనువుగా ఉందనే అనుమానం పెంచుకున్న నాగూర్... ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. ఆమె ఒత్తిడి చేయడంతో... చివరకు ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఒకరోజు ఇద్దరూ కలుసుకున్నారు. అక్కడా నజీమా పెళ్లి ప్రస్తావన తేవడం, చిన్నపాటి గొడవ తలెత్తడంతో ఆగ్రహంతో నజీమా గొంతు నులిమేశాడు.. గోడకేసి కొట్టి హత్య చేసినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.

కట్టర్​తో కట్ చేసి..

విషయం బయటకు తెలుస్తుందని... కట్టర్​తో ఆమె శరీర భాగాలను ముక్కలుముక్కలుగా చేశాడు. గోనెసంచిలో కుక్కి సుద్దపల్లిడొంక శివారులోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కాలిపోయిన స్థితిలో ఈ మృతదేహాన్ని గుర్తుపట్టని పోలీసులు.... ఫోరెన్సిక్ ల్యాబ్ లో మాత్రం డీఎన్ఏను భద్రపరిచారు. ఇన్నాళ్లకు నిందితుడిని విచారించడంతో ఘటనాస్థలిని చూపించడం... ఫోరెన్సిక్ ల్యాబ్​లోని డీఎన్ఏ... తల్లిదండ్రుల డీఎన్ఏతో సరిపోలడంతో చనిపోయింది నజీమానేనని నిర్ధారించారు. కచ్చితమైన సాక్ష్యాధారాలతో నిందితుడిని అరెస్టు చేశామని.... ఈ కేసులో మరెవరి పాత్ర లేదని ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.

అరెస్టు అనంతరం నిందితుడు షేక్ కరీం అలియాస్ నాగూర్​ను మీడియా ముందుపెట్టిన పోలీసులు... అతని వద్ద నుంచి కటింగ్ మిషన్, మృతురాలి ఆధార్ కార్డు, పెట్రోల్ బాటిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఎందుకంత జాప్యం..?!

కాగా ఈ కేసులో అప్పటి పోలీసులు వహించిన పాత్ర చర్చనీయాంశమైంది. నిందితుడిని పట్టుకోవడంలో రెండున్నరేళ్లుగా జాప్యం జరగడం విమర్శలకు తావిచ్చింది. చివరకు తల్లిదండ్రులు ఐజీ త్రివిక్రమ వర్మను కలవకపోతే... ఆయన దర్యాప్తునకు ఆదేశించకపోతే.. నజీమా హత్య కేసు మిస్టరీగానే మిగిలేది.

ఇదీ చదవండి: టచ్ ఫోన్​కు ఆశపడ్డాడు.. కటకటాల పాలయ్యాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.