ETV Bharat / international

లోయలో పడిన బస్సు.. 25 మంది మృతి.. అనేక మందికి గాయాలు

author img

By

Published : Jan 29, 2023, 6:42 AM IST

Updated : Jan 29, 2023, 7:32 AM IST

పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిన ఘటనలో 25 మంది చనిపోయారు. అనేక మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

peru road accident
పెరూ బస్సు ప్రమాదం

పెరూ రాజధాని లిమాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా.. అనేక మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. పెరూ కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన.

పెరూ నుంచి వెళ్తున్న ఓ బస్సు ఈక్వెడార్​ సరిహద్దు సమీపంలోని టుంబేస్ ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.పెరూలో రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల అజాగ్రత్త, అతివేగమే కారణాలని పెరూ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. ఘటనాస్థలికి రెస్క్యూ సిబ్బంది చేరుకోవడం ఆలస్యం అవుతుందని.. అంతలోపే రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు ప్రాణాలు పోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పెరూ రాజధాని లిమాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా.. అనేక మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. పెరూ కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన.

పెరూ నుంచి వెళ్తున్న ఓ బస్సు ఈక్వెడార్​ సరిహద్దు సమీపంలోని టుంబేస్ ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.పెరూలో రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల అజాగ్రత్త, అతివేగమే కారణాలని పెరూ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. ఘటనాస్థలికి రెస్క్యూ సిబ్బంది చేరుకోవడం ఆలస్యం అవుతుందని.. అంతలోపే రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు ప్రాణాలు పోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Last Updated : Jan 29, 2023, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.