ETV Bharat / international

కరోనా: చైనాలో 2,715కు చేరిన మృతుల సంఖ్య

author img

By

Published : Feb 26, 2020, 12:12 PM IST

Updated : Mar 2, 2020, 3:09 PM IST

కరోనా వైరస్​ బారిన పడి చైనాలో మరో 52 మంది మరణించారు. ఫలితంగా.. మొత్తం మృతుల సంఖ్య 2,715 కు చేరింది. తాజా మరణాలన్నీ వైరస్​ తీవ్రత అధికంగా ఉన్న హుబేలో చోటుచేసుకోవడం గమనార్హం.

China coronavirus
కరోనా కాటుకు 2,715కు చేరిన మృతుల సంఖ్య

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ మరణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా చైనాలో మరో 52 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,715 కు చేరింది. కొత్తగా 406 మందికి ఈ మహమ్మారి సోకగా.. మొత్తం వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 78,064 కు చేరుకుంది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ తగ్గుముఖం పడుతోందని చైనా ఆరోగ్య కమిషన్​ వెల్లడించింది. ఇప్పటివరకు 29,745 మంది వైరస్ ​నుంచి విముక్తులై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారని అధికారులు తెలిపారు. 6.47 లక్షల మందికి వైరస్​ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. 79వేల మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా...

హాంకాంగ్​లో వైరస్​ సోకి ఇప్పటివరకు ఇద్దరు మరణించగా.. 85 కేసులు నమోదయ్యాయి. తైవాన్​లో 31 మంది వైరస్​ బారిన పడగా.. ఒకరు మృతిచెందారు. మకావూలో 10 మంది ఈ మహమ్మారి బారినడ్డారు.

చైనా, ఇరాన్​పై అమెరికా ఆగ్రహం...

కరోనా వైరస్​ వ్యాప్తి గురించి ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్న తరుణంలో... ఆ కేసులను బయటపెట్టకుండా చైనా, ఇరాన్​లు ప్రయత్నిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో విమర్శించారు. రెండు ప్రభుత్వాలూ.. కేసులను కప్పిపెడుతున్నాయని ఆరోపించారు. వైరస్​కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ... అంతర్జాతీయ సంస్థలకు సాయపడాలని సూచించారు.

పాత్రికేయులు తప్పనిసరి...

బీజింగ్​లో ఇద్దరు రిపోర్టర్లను బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండించారు మైక్​. ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని చేరవేసేందుకు పాత్రికేయులు తప్పనిసరిగా ఉండాలన్నారు పాంపియో.

ఇదీ చదవండి: కొరియాలోని అమెరికా జవానుకు కరోనా..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ మరణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా చైనాలో మరో 52 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,715 కు చేరింది. కొత్తగా 406 మందికి ఈ మహమ్మారి సోకగా.. మొత్తం వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 78,064 కు చేరుకుంది.

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ తగ్గుముఖం పడుతోందని చైనా ఆరోగ్య కమిషన్​ వెల్లడించింది. ఇప్పటివరకు 29,745 మంది వైరస్ ​నుంచి విముక్తులై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారని అధికారులు తెలిపారు. 6.47 లక్షల మందికి వైరస్​ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. 79వేల మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా...

హాంకాంగ్​లో వైరస్​ సోకి ఇప్పటివరకు ఇద్దరు మరణించగా.. 85 కేసులు నమోదయ్యాయి. తైవాన్​లో 31 మంది వైరస్​ బారిన పడగా.. ఒకరు మృతిచెందారు. మకావూలో 10 మంది ఈ మహమ్మారి బారినడ్డారు.

చైనా, ఇరాన్​పై అమెరికా ఆగ్రహం...

కరోనా వైరస్​ వ్యాప్తి గురించి ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్న తరుణంలో... ఆ కేసులను బయటపెట్టకుండా చైనా, ఇరాన్​లు ప్రయత్నిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో విమర్శించారు. రెండు ప్రభుత్వాలూ.. కేసులను కప్పిపెడుతున్నాయని ఆరోపించారు. వైరస్​కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ... అంతర్జాతీయ సంస్థలకు సాయపడాలని సూచించారు.

పాత్రికేయులు తప్పనిసరి...

బీజింగ్​లో ఇద్దరు రిపోర్టర్లను బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండించారు మైక్​. ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని చేరవేసేందుకు పాత్రికేయులు తప్పనిసరిగా ఉండాలన్నారు పాంపియో.

ఇదీ చదవండి: కొరియాలోని అమెరికా జవానుకు కరోనా..

Last Updated : Mar 2, 2020, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.