ETV Bharat / crime

చోరీకి వచ్చాడు.. అమ్మవారి ముఖం చూసి వెళ్లిపోయాడు..! - Jagityal District Latest News

తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలో శివరాత్రి రోజున పలు చోట్ల దొంగతనాలు జరిగాయి. ఆలయం తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లిన దొంగ.. అమ్మవారి ముఖం చూసి ఎలాంటి చోరీ చేయకుండా వెళ్లిపోవడం విశేషం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

theft
చోరీకి వచ్చాడు.. అమ్మవారి ముఖం చూసి వెళ్లిపోయాడు..!
author img

By

Published : Mar 12, 2021, 8:21 PM IST

చోరీకి వచ్చాడు.. అమ్మవారి ముఖం చూసి వెళ్లిపోయాడు..!

శివరాత్రి పండుగ సందర్భంగా ప్రజలందరూ ఆలయాల్లో పూజలు చేస్తుంటే.. దొంగలు మాత్రం దారి చూసుకుని దొరికింది దోచుకున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలో శివరాత్రి రోజున పలు చోట్ల చోరీలు జరిగాయి. పట్టణ శివారులోని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో తాళాలు పగులగొట్టి ఓ దుండగుడు లోనికెళ్లాడు.

అమ్మవారి ముఖం చూసి..

తలుపులు తీసి దేవుడి వద్దకు వెళ్లడంతో ఆ దొంగకు ఏమనిపించిందో ఏమో.. ఒక్కసారిగా అమ్మవారి ముఖం చూసి ఎలాంటి దొంగతనం చేయకుండా తిరిగి వెళ్లిపోయాడు. అనంతరం పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో షట్టర్ తాళాలు పగలగొట్టి దుకాణం కౌంటర్​లోని నగదును దోచుకున్నాడు.

తిరిగి వెళ్తూ ఫ్రిడ్జ్​లోని మద్యం బాటిళ్లను తీసుకెళ్లాడు. మరో రెండిళ్లలో తాళాలు పగులగొట్టి కొంత నగదుతో పాటు బంగారం దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు చిత్రీకరించడంతో దోపిడీ బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కంకిపాడులోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

చోరీకి వచ్చాడు.. అమ్మవారి ముఖం చూసి వెళ్లిపోయాడు..!

శివరాత్రి పండుగ సందర్భంగా ప్రజలందరూ ఆలయాల్లో పూజలు చేస్తుంటే.. దొంగలు మాత్రం దారి చూసుకుని దొరికింది దోచుకున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలో శివరాత్రి రోజున పలు చోట్ల చోరీలు జరిగాయి. పట్టణ శివారులోని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో తాళాలు పగులగొట్టి ఓ దుండగుడు లోనికెళ్లాడు.

అమ్మవారి ముఖం చూసి..

తలుపులు తీసి దేవుడి వద్దకు వెళ్లడంతో ఆ దొంగకు ఏమనిపించిందో ఏమో.. ఒక్కసారిగా అమ్మవారి ముఖం చూసి ఎలాంటి దొంగతనం చేయకుండా తిరిగి వెళ్లిపోయాడు. అనంతరం పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో షట్టర్ తాళాలు పగలగొట్టి దుకాణం కౌంటర్​లోని నగదును దోచుకున్నాడు.

తిరిగి వెళ్తూ ఫ్రిడ్జ్​లోని మద్యం బాటిళ్లను తీసుకెళ్లాడు. మరో రెండిళ్లలో తాళాలు పగులగొట్టి కొంత నగదుతో పాటు బంగారం దోచుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు చిత్రీకరించడంతో దోపిడీ బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కంకిపాడులోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.