ETV Bharat / crime

కరడుగట్టిన నేరగాళ్లపై పీడీయాక్ట్‌... తెలంగాణలో మూడేళ్లలో 800 కేసులు - నేరాల సంఖ్య

ఆయుబ్‌ఖాన్‌.. అతనో కరుడగట్టిన నేరగాడు. ఒకటి రెండు కాదు.. అతనిపై ఏకంగా 30 క్రిమినల్‌ కేసులున్నాయి. హత్య కేసులు కూడా నమోదయ్యాయి. అరెస్టయిన కొద్ది నెలల్లోనే మళ్లీ బయటకు వచ్చి అనేకమందిని బెదిరించడం తీవ్రమైన నేరాలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. అప్పటికే అతనిపై రౌడీషీటు తెరిచినా కూడా ఆగడాలు అధికం కావడంతో కొద్ది నెలల కిందట హైదరాబాద్‌ నగర పోలీసులు అతనిపై ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్ట్‌ (పీడీ) కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు సంబంధిత రౌడీషీటర్‌ ఆగడాలే కాకుండా అతని గ్యాంగ్‌ నేరాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయని పోలీసులు చెబుతున్నారు. వైద్యపరమైన కారణంగా కోర్టు ఆదేశాల మేరకు కొద్ది రోజుల పాటు బెయిల్‌ మీద రావడంతో అతనిపై పోలీసులు కన్నేశారు.

కరడుగట్టిన నేరగాళ్లపై పీడీయాక్ట్‌
కరడుగట్టిన నేరగాళ్లపై పీడీయాక్ట్‌
author img

By

Published : Mar 15, 2021, 12:18 PM IST

మహాగనగరంలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి పోలీసులు సరికొత్త అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమీషనరేట్ల పరిధిలో హత్యలు, హత్యాయత్నాలకు ప్రధాన కారణమవుతున్న రౌడీషీటర్లపై ప్రధానంగా దృష్టి సారించారు. కరుడుగట్టిన ఈ నేరగాళ్లను పీడీయాక్టు కింద జైళ్లకు పంపిస్తున్నారు. వారి అనుచరులపై కూడా ఉక్కుపాదం మోపడంతో సంబంధిత ప్రాంతాల్లో చాలా వరకు నేరాల సంఖ్య తగ్గుతోందని పోలీసులు చెబుతున్నారు. మహానగరంలో అనేక ఘటనలకు కారణమవుతున్న నేరగాళ్లను గుర్తించి పీడీయాక్టును అమలు చేసేందుకు తాజాగా పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

3వేల మంది రౌడీషీటర్లు..

నగరంలో గతేడాది అన్ని రకాలుగా 15,858 కేసులు నమోదు కాగా సైబరాబాద్‌ పరిధిలో 24,868 కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో కూడా 18 వేలకు పైగా కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం నేరాలు జరిగిన తీరును పోలీసులు విశ్లేషిస్తే 30 శాతానికిపైగా కేసుల్లో పాత నేరగాళ్ల పాత్రే ఉందని తేలింది. వీరిని అదుపు చేస్తే చాలా వరకు నేరాల సంఖ్య తగ్గుతుందన్న భావనకు పోలీసులు వచ్చారు. మూడు కమీషనరేట్ల పరిధిలో 3 వేల మందికిపైగా రౌడీషీటర్లు ఉన్నారు. ఐదారు నేరాల్లో ప్రమేయం ఉంటే వారిపై రౌడీషీటు తెరుస్తున్నారు. సంబంధిత కేసుల్లో పోలీసులు అరెస్టు చేసినా తరువాత బెయిల్‌ మీద వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు.

మొగ్గలోనే తుంచేయాలన్న ఉద్దేశంతో ..

నేరస్థులను మొగ్గలోనే తుంచేయాలన్న ఉద్దేశంతో మూడేళ్లుగా పీడీయాక్టును అమలు చేయడం మొదలుపెట్టారు. ఈచట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే ఏడాదిపాటు సంబంధిత నేరగాడికి బెయిల్‌ రాదు. జైలులో ఉండాల్సిందే. గతేడాది హైదరాబాద్‌ పరిధిలో 109 మంది సైబరాబాద్‌ పరిధిలో 83 మంది, రాచకొండ కమీషనరేట్‌ పరిధిలో 82 మందిపై పీడీయాక్టును నమోదు చేశారు. వీరి అనుచరుల కదలిలకపై దృష్టి సారించారు. గత మూడేళ్లలో 800 మందికిపైగా నేరగాళ్లపై పీడీ చట్టాన్ని అమలు చేశారు.

ఇదీ చూడండి: వాయిదా పడిన ప్రాంతాల్లో.. కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు

మహాగనగరంలో నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి పోలీసులు సరికొత్త అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమీషనరేట్ల పరిధిలో హత్యలు, హత్యాయత్నాలకు ప్రధాన కారణమవుతున్న రౌడీషీటర్లపై ప్రధానంగా దృష్టి సారించారు. కరుడుగట్టిన ఈ నేరగాళ్లను పీడీయాక్టు కింద జైళ్లకు పంపిస్తున్నారు. వారి అనుచరులపై కూడా ఉక్కుపాదం మోపడంతో సంబంధిత ప్రాంతాల్లో చాలా వరకు నేరాల సంఖ్య తగ్గుతోందని పోలీసులు చెబుతున్నారు. మహానగరంలో అనేక ఘటనలకు కారణమవుతున్న నేరగాళ్లను గుర్తించి పీడీయాక్టును అమలు చేసేందుకు తాజాగా పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

3వేల మంది రౌడీషీటర్లు..

నగరంలో గతేడాది అన్ని రకాలుగా 15,858 కేసులు నమోదు కాగా సైబరాబాద్‌ పరిధిలో 24,868 కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో కూడా 18 వేలకు పైగా కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం నేరాలు జరిగిన తీరును పోలీసులు విశ్లేషిస్తే 30 శాతానికిపైగా కేసుల్లో పాత నేరగాళ్ల పాత్రే ఉందని తేలింది. వీరిని అదుపు చేస్తే చాలా వరకు నేరాల సంఖ్య తగ్గుతుందన్న భావనకు పోలీసులు వచ్చారు. మూడు కమీషనరేట్ల పరిధిలో 3 వేల మందికిపైగా రౌడీషీటర్లు ఉన్నారు. ఐదారు నేరాల్లో ప్రమేయం ఉంటే వారిపై రౌడీషీటు తెరుస్తున్నారు. సంబంధిత కేసుల్లో పోలీసులు అరెస్టు చేసినా తరువాత బెయిల్‌ మీద వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు.

మొగ్గలోనే తుంచేయాలన్న ఉద్దేశంతో ..

నేరస్థులను మొగ్గలోనే తుంచేయాలన్న ఉద్దేశంతో మూడేళ్లుగా పీడీయాక్టును అమలు చేయడం మొదలుపెట్టారు. ఈచట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే ఏడాదిపాటు సంబంధిత నేరగాడికి బెయిల్‌ రాదు. జైలులో ఉండాల్సిందే. గతేడాది హైదరాబాద్‌ పరిధిలో 109 మంది సైబరాబాద్‌ పరిధిలో 83 మంది, రాచకొండ కమీషనరేట్‌ పరిధిలో 82 మందిపై పీడీయాక్టును నమోదు చేశారు. వీరి అనుచరుల కదలిలకపై దృష్టి సారించారు. గత మూడేళ్లలో 800 మందికిపైగా నేరగాళ్లపై పీడీ చట్టాన్ని అమలు చేశారు.

ఇదీ చూడండి: వాయిదా పడిన ప్రాంతాల్లో.. కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.