ఓ ద్విచక్రవానాన్ని కారు ఢీ కొట్టగా మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదండ్రులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: అరకు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం