ETV Bharat / crime

తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య

author img

By

Published : Apr 17, 2021, 12:45 PM IST

లాక్​డౌన్​ కారణంతో ఇంట్లోనే ఉంటున్న బాలిక చదువుకోకుండా నిత్యం టీవీ, సెల్​ఫోన్​ చూస్తున్న ఆమెను తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపానికి గురైన బాలిక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో చోరటు చేసుకుంది.

suicide
తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య

తెలంగాణలోని వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఏకే తండాకు చెందిన మునవత్, కవిత దంపతుల కుమార్తె లాక్​డౌన్ వల్ల పాఠశాల లేకపోవడంతో బాలిక ఇంటివద్దనే ఉంటుంది. చదువుకోకుండా నిత్యం టీవీ, సెల్​ఫోన్ చూస్తున్న బాలికను తల్లిదండ్రులు మందలించారు.

మనస్థాపం చెందిన బాలిక పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల మందలింపుతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణలోని వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఏకే తండాకు చెందిన మునవత్, కవిత దంపతుల కుమార్తె లాక్​డౌన్ వల్ల పాఠశాల లేకపోవడంతో బాలిక ఇంటివద్దనే ఉంటుంది. చదువుకోకుండా నిత్యం టీవీ, సెల్​ఫోన్ చూస్తున్న బాలికను తల్లిదండ్రులు మందలించారు.

మనస్థాపం చెందిన బాలిక పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రుల మందలింపుతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:

వివాహేతర సంబంధమే కారణమైంది.. అడ్డొచ్చాడని హతమార్చింది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.