ETV Bharat / city

యూజీసీ నిబంధనలను గీతం వర్సిటీ అతిక్రమించింది: విజయసాయి రెడ్డి

author img

By

Published : Oct 29, 2020, 5:37 PM IST

విశాఖ గీతం విశ్వవిద్యాలయం పలు నిబంధనలు ఉల్లంఘించిందని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఛైర్మన్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రికి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. వర్సిటీ హోదా ఉపసంహరించాలని కోరారు.

YCP MP Vijaya Sai Reddy
YCP MP Vijaya Sai Reddy

విశాఖ గీతం విశ్వ విద్యాలయం నిబంధనలు ఉల్లంఘించిందంటూ కేంద్రానికి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఛైర్మన్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్​కు గురువారం లేఖ రాశారు.

యూజీసీ నిబంధనలను గీతం వర్సిటీ అతిక్రమించిందని లేఖలో ఎంపీ ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించినందున వర్సిటీ హోదా ఉపసంహరించాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ భూములను గీతం విశ్వ విద్యాలయం ఆక్రమించిందని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు సత్వరమే విచారణ జరపాలని కోరారు. పలు ఉల్లంఘనల దృష్ట్యా గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేయాలని విజయసాయిరెడ్డి లేఖలో విజ్ఞప్తి చేశారు.

విశాఖ గీతం విశ్వ విద్యాలయం నిబంధనలు ఉల్లంఘించిందంటూ కేంద్రానికి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఛైర్మన్, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్​కు గురువారం లేఖ రాశారు.

యూజీసీ నిబంధనలను గీతం వర్సిటీ అతిక్రమించిందని లేఖలో ఎంపీ ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించినందున వర్సిటీ హోదా ఉపసంహరించాలని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ భూములను గీతం విశ్వ విద్యాలయం ఆక్రమించిందని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు సత్వరమే విచారణ జరపాలని కోరారు. పలు ఉల్లంఘనల దృష్ట్యా గీతం వర్సిటీకి నోటీసులు జారీ చేయాలని విజయసాయిరెడ్డి లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌పై విజయసాయిరెడ్డి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.