ETV Bharat / city

3 capitals proposal విశాఖ గర్జనకు సర్వం సిద్ధం..మద్దతు తెలిపిన వైకాపా

author img

By

Published : Oct 15, 2022, 9:23 AM IST

Updated : Oct 15, 2022, 11:42 AM IST

Visakha Garjana: గత కొద్ది కాలంగా అమరావతి రైతులు రాజధాని కోసం చేస్తున్న నిరసనలకు, వారి సమస్యల పరిష్కారానికి స్పందించని వైకాపా ప్రభుత్వం నేడు విశాఖ గర్జనకు మాత్రం పోటీపడి మరి మద్దతు తెలుపుతుంది. అందుకోసం మంత్రులు మరో అడుగు ముందుకేసి రాజీనామాలు చేయడానికైనా సిద్ధమంటూ ముందుకు వస్తున్నారు. విశాఖ గర్జనకు సర్వం సిద్ధమైంది. పరిపాలన రాజధాని కోసం ఐకాస తలపెట్టిన ఈ కార్యక్రమానికి, అధికార వైకాపా పూర్తి మద్దతు తెలిపింది. అమరావతి రైతులు ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తున్నారని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు.

Visakha Garjana
విశాఖ గర్జనకు మద్దతు తెలిపిన వైకాపా

YSRCP Visakha Garjana to support 3 capitals proposal: విశాఖ గర్జనకు సర్వం సిద్ధమైంది. పరిపాలన రాజధాని కోసం ఐకాస తలపెట్టిన ఈ కార్యక్రమానికి, అధికార వైకాపా పూర్తి మద్దతు తెలిపింది. అమరావతి రైతులు ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తున్నారని ఆరోపిస్తున్న నేతలు.. విశాఖ గర్జన ద్వారా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గట్టిగా చాటిచెబుతామని స్పష్టంచేశారు.

అధికార వైకాపా మద్దతుతో రాజకీయేతర ఐకాస తలపెట్టిన విశాఖ గర్జనకు ఏర్పాట్లుచేశారు. ఉదయం 9 గంటలకు ఎల్ఐసీ జంక్షన్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి గర్జన ర్యాలీ ప్రారంభమవుతుంది. సెవెన్‌ హిల్స్ జంక్షన్‌ మీదుగా పార్క్‌ హోటల్‌ జంక్షన్‌కు చేరుకుంటుంది. అల్లూరి సీతారామరాజు, వైఎస్‌ఆర్ విగ్రహాల వద్ద బహిరంగ వేదిక వద్దకు చేరుకున్నాక నేతలు ప్రసంగిస్తారు.

మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానుల ఏర్పాటుకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు, వైకాపా ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. విశాఖ గర్జన ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించడానికి దక్కిన ఈ అవకాశాన్ని గట్టిగా ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

విశాఖ గర్జన దృష్ట్యా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బీచ్‌ రోడ్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి పార్క్ హోటల్‌ వరకు వాహనాలను అనుమతించడం లేదు. రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు... ఆసిల్‌మెట్ట ఫ్లైఓవర్‌ ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

ఇవీ చదవండి:

YSRCP Visakha Garjana to support 3 capitals proposal: విశాఖ గర్జనకు సర్వం సిద్ధమైంది. పరిపాలన రాజధాని కోసం ఐకాస తలపెట్టిన ఈ కార్యక్రమానికి, అధికార వైకాపా పూర్తి మద్దతు తెలిపింది. అమరావతి రైతులు ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తున్నారని ఆరోపిస్తున్న నేతలు.. విశాఖ గర్జన ద్వారా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గట్టిగా చాటిచెబుతామని స్పష్టంచేశారు.

అధికార వైకాపా మద్దతుతో రాజకీయేతర ఐకాస తలపెట్టిన విశాఖ గర్జనకు ఏర్పాట్లుచేశారు. ఉదయం 9 గంటలకు ఎల్ఐసీ జంక్షన్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి గర్జన ర్యాలీ ప్రారంభమవుతుంది. సెవెన్‌ హిల్స్ జంక్షన్‌ మీదుగా పార్క్‌ హోటల్‌ జంక్షన్‌కు చేరుకుంటుంది. అల్లూరి సీతారామరాజు, వైఎస్‌ఆర్ విగ్రహాల వద్ద బహిరంగ వేదిక వద్దకు చేరుకున్నాక నేతలు ప్రసంగిస్తారు.

మూడు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానుల ఏర్పాటుకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు, వైకాపా ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. విశాఖ గర్జన ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించడానికి దక్కిన ఈ అవకాశాన్ని గట్టిగా ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

విశాఖ గర్జన దృష్ట్యా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బీచ్‌ రోడ్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి పార్క్ హోటల్‌ వరకు వాహనాలను అనుమతించడం లేదు. రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు... ఆసిల్‌మెట్ట ఫ్లైఓవర్‌ ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 15, 2022, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.