ETV Bharat / city

కోడెల మృతికి చంద్రబాబే కారణం: ఉమ్మారెడ్డి

author img

By

Published : Oct 13, 2019, 11:44 PM IST

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు... రివ్యూల పేరుతో రాష్ట్రమంతా తిరుగుతున్నారని... ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై చర్చలు మానేసి జగన్​పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైకాపా శాసనమండలి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వేధింపుల కారణంగా కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి పాల్పడ్డారని... వైకాపా శాసనమండలి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. విశాఖ వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి కోడెలను పిలవలేదని, ఆయన ఉండగానే మరొకరిని ఇంఛార్జ్​గా నియమించి మనసును క్షోభపెట్టారని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులకు మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబేనని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు.

తునిలో కాపు ఉద్యమం కోసం పోరాడిన ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులతో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. నీచ రాజకీయాలు చేయడం చంద్రబాబు తత్వమని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న చంద్రబాబు... రౌడీయిజం పేటెంట్ తీసుకున్నారని దుయ్యబట్టారు. తెదేపా మళ్ళీ భాజపా, జనసేన పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజకీయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు... రివ్యూల పేరుతో రాష్ట్రమంతా తిరుగుతున్నారని... ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై చర్చలు మానేసి జగన్​పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... 'పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేపట్టండి'

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వేధింపుల కారణంగా కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి పాల్పడ్డారని... వైకాపా శాసనమండలి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. విశాఖ వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి కోడెలను పిలవలేదని, ఆయన ఉండగానే మరొకరిని ఇంఛార్జ్​గా నియమించి మనసును క్షోభపెట్టారని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులకు మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబేనని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు.

తునిలో కాపు ఉద్యమం కోసం పోరాడిన ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులతో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. నీచ రాజకీయాలు చేయడం చంద్రబాబు తత్వమని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న చంద్రబాబు... రౌడీయిజం పేటెంట్ తీసుకున్నారని దుయ్యబట్టారు. తెదేపా మళ్ళీ భాజపా, జనసేన పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజకీయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు... రివ్యూల పేరుతో రాష్ట్రమంతా తిరుగుతున్నారని... ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై చర్చలు మానేసి జగన్​పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... 'పోలవరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేపట్టండి'

Rajouri (JandK), Oct 12 (ANI): In a bid to provide safe and dignified travel option to women and girls, the district administration here in association with the Motor Vehicle Department launched six pink vehicles to mark the International Girl Child Day, 2019. The Mahindra Supro Exclusive women pink vehicles were launched on Friday by the District Development Commissioner (DDC), Rajouri, Mohammad Aijaz Asad, in the presence of Senior Superintendent of Police (SSP), Yougal Manhas, Additional Deputy Commissioner (ADP) Rajouri, Sher Singh among other officials. A total of six eight-seater pink vehicles will ply between Old Bus stand to GMC and AH, New Bus stand to GMC and AH and Old Bus stand to Khandli. The service will be available from 8:00 am to 8:30 pm every day. On the occasion, a mega awareness rally was organised which started from PWD Dak Bungalow Rajouri and culminated at Government Girls Model Higher Secondary School, Rajouri.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.