ETV Bharat / city

ప్లాటు ఇప్పిస్తామని రూ.93 లక్షలకు టోకరా.. ఇద్దరు అరెస్ట్

author img

By

Published : Jan 23, 2021, 8:38 PM IST

అపార్ట్​మెంట్​లో ప్లాటు ఇప్పిస్తానని నమ్మించి ఓ వృద్ధురాలి నుంచి లక్షల రూపాయలు కాజేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 24 లక్షల నగదు, ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన విశాఖలోని గాజువాక శ్రీనగర్​లో చోటు చేసుకుంది.

two persons arrested in a embezzling case
ప్లాటు ఇప్పిస్తామని నమ్మించి రూ.93 లక్షలు కాజేసిన ఘటనలో ఇద్దరు అరెస్ట్

విశాఖలో ఓ వృద్ధురాలిని నమ్మించి రూ. 93లక్షలు కాజేసిన ఘటనలో నాగభూషణం, మహిళ రమణమ్మను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 24లక్షల నగదు, రూ. 25లక్షల విలువైన బంగారం, 6కేజీల వెండి, ఒక ద్విచక్రవాహనం, ఐఫోన్, రూ. 5లక్షల విలువ చేసే బాండ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు కలిసి గాజువాక శ్రీనగర్​లోని అపార్ట్​మెంట్​లో ప్లాటు, స్థలాలు ఇప్పిస్తానని చెప్పి వృద్ధురాలు లీలావతి నుంచి పలు దఫాలుగా రూ. 98 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తెలినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి

విశాఖలో ఓ వృద్ధురాలిని నమ్మించి రూ. 93లక్షలు కాజేసిన ఘటనలో నాగభూషణం, మహిళ రమణమ్మను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 24లక్షల నగదు, రూ. 25లక్షల విలువైన బంగారం, 6కేజీల వెండి, ఒక ద్విచక్రవాహనం, ఐఫోన్, రూ. 5లక్షల విలువ చేసే బాండ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు కలిసి గాజువాక శ్రీనగర్​లోని అపార్ట్​మెంట్​లో ప్లాటు, స్థలాలు ఇప్పిస్తానని చెప్పి వృద్ధురాలు లీలావతి నుంచి పలు దఫాలుగా రూ. 98 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తెలినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి

స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.