విశాఖ రైల్వేస్టేషన్లో స్వచ్ఛతహిసేవా కార్యక్రమాన్ని వాల్తేర్ డీఆర్ఎం చేతన్కుమార్ శ్రీవాత్సవ ప్రారంభించారు. అక్టోబర్ 2 వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయని ఆయన వివరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ పై అవగాహన కల్పిస్తూ... స్కౌట్స్ అండ్ గైడ్స్ చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం వాల్తేర్ డివిజన్ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ఉచితంగా కాగితపు సంచులు అందజేశారు. ప్లాస్టిక్ వినియోగించవద్దంటూ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు చేతన్కుమార్... రైల్వే ఉద్యోగులందరి చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చదవండి