ETV Bharat / city

నర్సీపట్నం పీఠానికి ఎన్నికలు.. ఆశగా ఓటర్ల ఎదురుచూపులు

పుర పోరు సన్నద్ధమవుతున్న తరుణంలో పాలకవర్గాల కొలువు తీరుపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పురపాలక ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధానంగా పీఠం దక్కించుకోవడానికి అధికార, విపక్ష పార్టీలు పోటీ పడుతుండడంతో పురపాలిక ప్రజలు వారి భవిష్యత్తును నిర్దేశించనున్నారు. స్థానిక సమస్యలు అపరిష్కుతంగానే ఉండడంతో అక్కడి ప్రజలు పెదవి విరుస్తున్నారు.

author img

By

Published : Mar 2, 2021, 9:07 PM IST

Updated : Mar 2, 2021, 10:47 PM IST

narsipatnam municipal elections
నర్సీపట్నం పీఠానికి ఎన్నికలు.. ఆశగా ఓటర్ల ఎదురుచూపులు

విశాఖ జిల్లాలో నర్సీపట్నం మున్సిపాలిటీ పాలకవర్గం సమయం గత ఏడాదే పూర్తయింది. మేజర్ పంచాయతీగా ఉన్న నర్సీపట్నం.. ఆరేళ్ల క్రితం మున్సిపాలిటీగా మారింది. ఈ నేపథ్యంలో తొలి చైర్‌ పర్సన్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడి సతీమణి అనిత ఎన్నికయ్యారు. అప్పట్లో 27 వార్డులకు సంబంధించి 20కి పైగా స్థానాలను తెదేపా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఎన్నికలకు కొత్తగా మరో వార్డు రావడంతో వార్డుల సంఖ్య 28కి చేరింది.

నర్సీపట్నం సమస్యలు వెల్లడిస్తున్న స్థానికులు...

చైర్‌ పర్సన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయింపు:

ప్రస్తుతం మునిసిపాలిటీ జనాభా 67 వేలకు పైగా ఉండగా.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 47 వేల 383 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఈ దఫా పురపాలిక ఎన్నికల్లో చైర్‌ పర్సన్ పదవిని ఎస్సీ మహిళలకు కేటాయించడంతో.. అధికార పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రతిపక్ష పార్టీ నుంచి మాజీ మంత్రి తెదేపా సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు వర్గాలు ప్రముఖంగా పోటీపడుతున్నాయి.

వసతులలేమి వెంటాడుతూనే ఉంది:

మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ స్థాయికి ఎదిగిన నర్సీపట్నం.. రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా పేరు పొందడంతో పాటు విశాఖ మన్యానికి ముఖద్వారంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వ్యాపార వాణిజ్య పరంగా నర్సీపట్నం రోజురోజుకూ విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పట్టణాన్ని నివాసయోగ్యంగా తీర్చిదిద్దుతున్నారు. మున్సిపాలిటీ స్థాయికి నర్సీపట్నం ఎదిగినప్పటికీ తాగునీరు, రహదారుల సదుపాయం, పారిశుద్ధ్యం విషయాల్లో వెనుకబడే ఉందని అక్కడి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ మార్పుతో మూలనపడ్డ అభివృద్ధి పనులు:

పట్టణానికి సంబంధించి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాలు సంఖ్య పెరుగుతుండడంతో రహదారులు ఇరుకుగా తయారయ్యాయి. వ్యాపార వాణిజ్య సంస్థలకు వచ్చే కొనుగోలుదారులు వాహనాలను నిలిపేందుకు సరైన పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో పట్టణంలో వాహన రద్దీ అధికంగా ఉంది. తెదేపా నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద బొడ్డేపల్లి నుంచి నర్సీపట్నం వరకు ప్రధాన రహదారిని విస్తరించాలని ప్రతిపాదించారు. కానీ అది కార్యరూపం దాల్చక ముందే ప్రభుత్వం మారడంతో.. ఆ పనులు మూలన పడ్డాయి. పట్టణంలో సరైన తాగునీటి సదుపాయం లేదని కుళాయిలు, చేతిపంపులు నిర్వహణ సరిగా ఉండటం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ కట్టడాలకు అనుమతులు:

బ్రిటిష్ వారు నడయాడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన నర్సీపట్నంలో.. పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీంతో పాటు అక్రమకట్టడాలకు ఎలా అనుమతులు లభిస్తున్నాయో అర్థం కావడం లేదని పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు చేశామని, అయినప్పటికీ పాలకులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు పట్టణంలో కుక్కలు, పందులు విచ్చలవిడిగా తిరుగుతూ పట్టణ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ అభివృద్ధిపై పుస్తకం రూపొందించిన భాజపా

విశాఖ జిల్లాలో నర్సీపట్నం మున్సిపాలిటీ పాలకవర్గం సమయం గత ఏడాదే పూర్తయింది. మేజర్ పంచాయతీగా ఉన్న నర్సీపట్నం.. ఆరేళ్ల క్రితం మున్సిపాలిటీగా మారింది. ఈ నేపథ్యంలో తొలి చైర్‌ పర్సన్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడి సతీమణి అనిత ఎన్నికయ్యారు. అప్పట్లో 27 వార్డులకు సంబంధించి 20కి పైగా స్థానాలను తెదేపా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఎన్నికలకు కొత్తగా మరో వార్డు రావడంతో వార్డుల సంఖ్య 28కి చేరింది.

నర్సీపట్నం సమస్యలు వెల్లడిస్తున్న స్థానికులు...

చైర్‌ పర్సన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయింపు:

ప్రస్తుతం మునిసిపాలిటీ జనాభా 67 వేలకు పైగా ఉండగా.. ప్రభుత్వ లెక్కల ప్రకారం 47 వేల 383 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఈ దఫా పురపాలిక ఎన్నికల్లో చైర్‌ పర్సన్ పదవిని ఎస్సీ మహిళలకు కేటాయించడంతో.. అధికార పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, ప్రతిపక్ష పార్టీ నుంచి మాజీ మంత్రి తెదేపా సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు వర్గాలు ప్రముఖంగా పోటీపడుతున్నాయి.

వసతులలేమి వెంటాడుతూనే ఉంది:

మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ స్థాయికి ఎదిగిన నర్సీపట్నం.. రెవెన్యూ డివిజనల్ కేంద్రంగా పేరు పొందడంతో పాటు విశాఖ మన్యానికి ముఖద్వారంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వ్యాపార వాణిజ్య పరంగా నర్సీపట్నం రోజురోజుకూ విస్తరిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పట్టణాన్ని నివాసయోగ్యంగా తీర్చిదిద్దుతున్నారు. మున్సిపాలిటీ స్థాయికి నర్సీపట్నం ఎదిగినప్పటికీ తాగునీరు, రహదారుల సదుపాయం, పారిశుద్ధ్యం విషయాల్లో వెనుకబడే ఉందని అక్కడి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ మార్పుతో మూలనపడ్డ అభివృద్ధి పనులు:

పట్టణానికి సంబంధించి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాలు సంఖ్య పెరుగుతుండడంతో రహదారులు ఇరుకుగా తయారయ్యాయి. వ్యాపార వాణిజ్య సంస్థలకు వచ్చే కొనుగోలుదారులు వాహనాలను నిలిపేందుకు సరైన పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో పట్టణంలో వాహన రద్దీ అధికంగా ఉంది. తెదేపా నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద బొడ్డేపల్లి నుంచి నర్సీపట్నం వరకు ప్రధాన రహదారిని విస్తరించాలని ప్రతిపాదించారు. కానీ అది కార్యరూపం దాల్చక ముందే ప్రభుత్వం మారడంతో.. ఆ పనులు మూలన పడ్డాయి. పట్టణంలో సరైన తాగునీటి సదుపాయం లేదని కుళాయిలు, చేతిపంపులు నిర్వహణ సరిగా ఉండటం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ కట్టడాలకు అనుమతులు:

బ్రిటిష్ వారు నడయాడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన నర్సీపట్నంలో.. పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీంతో పాటు అక్రమకట్టడాలకు ఎలా అనుమతులు లభిస్తున్నాయో అర్థం కావడం లేదని పట్టణవాసులు పెదవి విరుస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు చేశామని, అయినప్పటికీ పాలకులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు పట్టణంలో కుక్కలు, పందులు విచ్చలవిడిగా తిరుగుతూ పట్టణ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ అభివృద్ధిపై పుస్తకం రూపొందించిన భాజపా

Last Updated : Mar 2, 2021, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.