ETV Bharat / city

విశాఖ మెట్రోకు వచ్చే నెలలో టెండర్లు:బొత్స

author img

By

Published : Oct 25, 2020, 4:01 PM IST

Updated : Oct 25, 2020, 6:59 PM IST

పాలనా రాజధానిగా ఎదుగుతున్న విశాఖపట్నంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరుగుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో మెట్రో కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. విభజన చట్టంలో మెట్రో ప్రాజెక్టు అంశం ఉంది కాబట్టి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. కేంద్రం సహకారం ఉన్నా లేకపోయినా విశాఖకు మెట్రో వచ్చి తీరుతుందని చెప్పారు.

metro rail office started in vizag
విశాఖలో మెట్రో కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభం

విశాఖ మెట్రోలో ప్రైవేటు భాగస్వామ్యమా? నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలా? అనే విషయంపై సీఎం జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స అన్నారు. విశాఖ మెట్రోకు డీపీఆర్ సిద్ధమవుతోందని.. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని బొత్స స్పష్టం చేశారు. విశాఖలో నాలుగు కారిడార్లుగా 75.31 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మిస్తామని చెప్పారు. మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు.

ఇవీ చదవండి..

విశాఖ మెట్రోలో ప్రైవేటు భాగస్వామ్యమా? నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలా? అనే విషయంపై సీఎం జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స అన్నారు. విశాఖ మెట్రోకు డీపీఆర్ సిద్ధమవుతోందని.. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని బొత్స స్పష్టం చేశారు. విశాఖలో నాలుగు కారిడార్లుగా 75.31 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మిస్తామని చెప్పారు. మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు.

ఇవీ చదవండి..

గీతం వర్సిటీ భూములు ప్రభుత్వానికి చెందినవి: బొత్స సత్యనారాయణ

Last Updated : Oct 25, 2020, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.