ETV Bharat / city

'4 నెలలుగా జీతాలు లేక కుటుంబాన్ని పోషించలేకపోతున్నాం' - విశాఖ జిల్లా తాజా వార్తలు

తన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు నిరనస చేపట్టారు. నాలుగు నెలలుగా జీతాలివ్వట్లేదని.. కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

gvmc sanitary Workers Agitation
జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన
author img

By

Published : Mar 27, 2021, 5:41 PM IST

జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన

విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి రావడానికి కిరాయికి కూడా డబ్బుల్లేని దయనీయస్థితిలో ఉన్నామని ఆవేదన చెందారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా.. జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రతి నెల జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్​ ఇబ్బందికి గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన పని భారం పెంచుతున్నారని పేర్కొన్నారు. కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని.. ఆ మేరకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

పింగళి తీసుకెళ్లిన జాతీయ పతాకాన్ని చూసి గాంధీ ఏమన్నారు..?

జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల నిరసన

విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి రావడానికి కిరాయికి కూడా డబ్బుల్లేని దయనీయస్థితిలో ఉన్నామని ఆవేదన చెందారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్నా.. జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రతి నెల జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్​ ఇబ్బందికి గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. విపరీతమైన పని భారం పెంచుతున్నారని పేర్కొన్నారు. కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని.. ఆ మేరకు జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

పింగళి తీసుకెళ్లిన జాతీయ పతాకాన్ని చూసి గాంధీ ఏమన్నారు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.