ETV Bharat / city

6 నెలల్లో ఎన్నికలు.. లేకపోతే మళ్లీ పోరాటం: గోపాల్​రెడ్డి

విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు ఆరు నెలల్లోగా నిర్వహించకపోతే.. మళ్లీ పోరాటం చేస్తానని గోపాల్​రెడ్డి అనే వ్యక్తి తెలిపారు. 2012లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ... జరపకపోవడాన్ని సవాల్ చేస్తూ విశాఖవాసి హైకోర్టులో పిల్​ దాఖలు చేశారు.

author img

By

Published : Apr 17, 2019, 4:32 PM IST

గోపాల్ రెడ్డి
గోపాల్ రెడ్డి

విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు ఆరు నెలల్లోగా జరపాలని ఈనెల 1న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు 2012లోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ... ఎన్నికలు జరపకపోవడాన్ని సవాల్ చేస్తూ విశాఖకు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పట్లో గోపాల్ రెడ్డి వేసిన పిల్​ను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది.

హైకోర్టు తీర్పు పట్ల పిటిషనర్ గోపాల్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇది విశాఖ ప్రజల విజయమని గోపాల్ రెడ్డి అన్నారు. జీవీఎంసీ ఎన్నికలు జరగకపోవడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న శాసనసభ్యులే కారణమని ఆరోపించారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు తమ ఉనికిని కోల్పోతామనే భయంతోనే జీవీఎంసీ ఎన్నికలు జరపకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా హక్కులకు తీవ్ర భంగం కలిగించారని అన్నారు. ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించకపోతే మళ్లీ న్యాయపరమైన పోరాటం చేస్తానని గోపాల్ రెడ్డి వెల్లడించారు

ఇదీ చదవండి

మెడకు చున్నీ బిగించి హత్యాయత్నం.. అనంతరం??

గోపాల్ రెడ్డి

విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు ఆరు నెలల్లోగా జరపాలని ఈనెల 1న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు 2012లోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ... ఎన్నికలు జరపకపోవడాన్ని సవాల్ చేస్తూ విశాఖకు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పట్లో గోపాల్ రెడ్డి వేసిన పిల్​ను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది.

హైకోర్టు తీర్పు పట్ల పిటిషనర్ గోపాల్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇది విశాఖ ప్రజల విజయమని గోపాల్ రెడ్డి అన్నారు. జీవీఎంసీ ఎన్నికలు జరగకపోవడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న శాసనసభ్యులే కారణమని ఆరోపించారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు తమ ఉనికిని కోల్పోతామనే భయంతోనే జీవీఎంసీ ఎన్నికలు జరపకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా హక్కులకు తీవ్ర భంగం కలిగించారని అన్నారు. ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించకపోతే మళ్లీ న్యాయపరమైన పోరాటం చేస్తానని గోపాల్ రెడ్డి వెల్లడించారు

ఇదీ చదవండి

మెడకు చున్నీ బిగించి హత్యాయత్నం.. అనంతరం??

Intro:ap_rjy_36_17_puducerry_election_proces_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్


Body:రేపటి ఎన్నికలకు సర్వం సన్నద్ధం


Conclusion:కేంద్రపాలిత పుదుచ్చేరి రాష్ట్ర పార్లమెంట్ స్థానానికి రేపు జరగనున్న ఎన్నికల సందర్భంగా అధికారులు అన్ని రకాల భద్రతా చర్యలను చేపట్టారు ఇందులో భాగంగా యానం నియోజకవర్గంలో సరిహద్దుల్లో 10 చెక్పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనా నీ తనిఖీ చేస్తున్నారు పోలింగ్ బూత్ లో ఏ రకమైన ప్రమాద సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా బాంబు స్క్వాడ్ పోలీస్ డాగ్స్ తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు రేపు పోలింగ్ నిర్వహించే సిబ్బందికి టర్నింగ్ అధికారి తగు సూచనలు చేస్తూ బూతుల వారి సిబ్బంది నియామకాల వివరాలు అందజేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.