ETV Bharat / city

తూర్పు కోస్తా పరిధిలో రోజువారీ రైళ్లు ప్రారంభం

author img

By

Published : Nov 11, 2020, 10:22 PM IST

తూర్పుకోస్తా రైల్వే తన పరిధిలోని కొన్ని రైళ్లను రోజువారీగా నడపాలని నిర్ణయించింది. విశాఖ-రాయగడ మధ్య ప్రత్యేక రైలును ప్రతిరోజు నడుపుతారు. పలాస-విశాఖ మధ్య డైలీ ప్రత్యేక ఎక్స్​ప్రెస్ రైలు నడుస్తుంది. భువనేశ్వర్-పలాస మధ్య మరో ప్రత్యేక డైలీ రైలు నడుపుతారు. రాయగడ- సంబల్​పూర్ మధ్య మరో పత్యేక డైలీ ఎక్స్​ప్రెస్ రైలు నడవనుంది. ప్రయాణికులంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Daily trains start in East Coast region..!
Daily trains start in East Coast region..!

ఈనెల 15 నుంచి తూర్పుకోస్తా రైల్వే తన పరిధిలోని కొన్ని రైళ్లను రోజువారీగా నడపాలని నిర్ణయించింది. విశాఖ-రాయగడ మధ్య ప్రత్యేక రైలును ప్రతిరోజు నడుపుతారు. సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు విశాఖలో బయలుదేరి, రాత్రి తొమ్మిది గంటలకు రాయగడ చేరుతుంది. రాయగడలో ఉదయం ఐదుగంటల 15 నిమిషాలకు బయలుదేరి తొమ్మిదిన్నరకు విశాఖ చేరుకుంటుంది. సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురంటౌన్ స్టేషన్లలో ఈ రైలు అగుతుంది.

పలాస-విశాఖ మధ్య డైలీ ప్రత్యేక ఎక్స్​ప్రెస్ రైలు నడుస్తుంది. ఈ రైలు విశాఖలో సాయంత్రం ఆరున్నరకు బయలుదేరి పలాసకు రాత్రి 11.30 గంటలకు చేరుతుంది. పలాసలో ఉదయం 5.25కి బయలుదేరి ఉదయం 10 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ రైలు సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, నౌపడ స్టేషన్లలో ఆగుతుంది.

భువనేశ్వర్-పలాస మధ్య మరో ప్రత్యేక డైలీ రైలు నడుపుతారు. ఇది భువనేశ్వర్​లో సాయంత్రం ఆరుగంటల 20 నిమిషాలకు బయలుదేరి రాత్రి 10.40కి పలాస చేరుతుంది. పలాసలో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి పది గంటల పది నిమిషాలకు భువనేశ్వర్ చేరుతుంది. ఈ రైలు సొంపేట, ఇచ్ఛాపురం, బ్రహ్మపూర్, ఛత్రపూర్, కళ్లికోట్, బౌల్గాన్, కాలుపరాఘాట్, నిరాకార్ పూర్, ఖుర్డారోడ్ స్టేషన్లలో ఆగుతుంది.

రాయగడ-సంబల్​పూర్ మధ్య మరో పత్యేక డైలీ ఎక్స్​ప్రెస్ రైలు నడవనుంది. ఉదయం ఆరు గంటలకు సంబల్​పూర్​లో బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు రాయగడ చేరుతుంది. రాయగడలో మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి.. రాత్రి ఎనిమిది గంటల 20 నిమిషాలకు సంబల్​పూర్ చేరుతుంది. హిరాకుడ్, అట్టబైర, బార్గారోడ్, బార్పలి, లొసింగ, బలంగీర్, సైంతాలా, బాడ్మల్, టిట్లాఘర్, కెసింగ, రూప్రరోడ్, నార్లరోడ్, లాంజిగర్ రోడ్, అంబదల, మునిగుడ, తిరుబలి, సింగపూర్ రోడ్ స్టేషన్లలో ఈ రైలు అగుతుంది. ప్రయాణికులంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఇదీ చదవండీ... రాష్ట్రంపై తగ్గుతున్న కొవిడ్ ప్రభావం.. తాజాగా 1732 కేసులు

ఈనెల 15 నుంచి తూర్పుకోస్తా రైల్వే తన పరిధిలోని కొన్ని రైళ్లను రోజువారీగా నడపాలని నిర్ణయించింది. విశాఖ-రాయగడ మధ్య ప్రత్యేక రైలును ప్రతిరోజు నడుపుతారు. సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు విశాఖలో బయలుదేరి, రాత్రి తొమ్మిది గంటలకు రాయగడ చేరుతుంది. రాయగడలో ఉదయం ఐదుగంటల 15 నిమిషాలకు బయలుదేరి తొమ్మిదిన్నరకు విశాఖ చేరుకుంటుంది. సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురంటౌన్ స్టేషన్లలో ఈ రైలు అగుతుంది.

పలాస-విశాఖ మధ్య డైలీ ప్రత్యేక ఎక్స్​ప్రెస్ రైలు నడుస్తుంది. ఈ రైలు విశాఖలో సాయంత్రం ఆరున్నరకు బయలుదేరి పలాసకు రాత్రి 11.30 గంటలకు చేరుతుంది. పలాసలో ఉదయం 5.25కి బయలుదేరి ఉదయం 10 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ రైలు సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్, తిలారు, నౌపడ స్టేషన్లలో ఆగుతుంది.

భువనేశ్వర్-పలాస మధ్య మరో ప్రత్యేక డైలీ రైలు నడుపుతారు. ఇది భువనేశ్వర్​లో సాయంత్రం ఆరుగంటల 20 నిమిషాలకు బయలుదేరి రాత్రి 10.40కి పలాస చేరుతుంది. పలాసలో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి పది గంటల పది నిమిషాలకు భువనేశ్వర్ చేరుతుంది. ఈ రైలు సొంపేట, ఇచ్ఛాపురం, బ్రహ్మపూర్, ఛత్రపూర్, కళ్లికోట్, బౌల్గాన్, కాలుపరాఘాట్, నిరాకార్ పూర్, ఖుర్డారోడ్ స్టేషన్లలో ఆగుతుంది.

రాయగడ-సంబల్​పూర్ మధ్య మరో పత్యేక డైలీ ఎక్స్​ప్రెస్ రైలు నడవనుంది. ఉదయం ఆరు గంటలకు సంబల్​పూర్​లో బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు రాయగడ చేరుతుంది. రాయగడలో మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరి.. రాత్రి ఎనిమిది గంటల 20 నిమిషాలకు సంబల్​పూర్ చేరుతుంది. హిరాకుడ్, అట్టబైర, బార్గారోడ్, బార్పలి, లొసింగ, బలంగీర్, సైంతాలా, బాడ్మల్, టిట్లాఘర్, కెసింగ, రూప్రరోడ్, నార్లరోడ్, లాంజిగర్ రోడ్, అంబదల, మునిగుడ, తిరుబలి, సింగపూర్ రోడ్ స్టేషన్లలో ఈ రైలు అగుతుంది. ప్రయాణికులంతా తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఇదీ చదవండీ... రాష్ట్రంపై తగ్గుతున్న కొవిడ్ ప్రభావం.. తాజాగా 1732 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.