భవిష్యత్తులో భాజపానే కీలక పార్టీగా రాష్ట్రంలో అవతరిస్తుందని కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు జోస్యం చెప్పారు. ప్రజా లబ్ధి చేకూర్చే పథకాలను ఈ రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశ వ్యాప్తంగా వేలాది మంది 'ఆయుష్మాన్ భారత్' పథకంలో లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. వారంతా తమ నేతలను కలిసి కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను వైఎస్సార్ ఆరోగ్య శ్రీగా మార్చి ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. ముద్ర , ఉజ్వల, కిసాన్ యోజన లాంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్రం పట్ల కేంద్రానికి ప్రత్యేక దృష్టి ఉందన్నారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించే సమయంలో ఆయన రైల్వే మంత్రిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రం కంటే.. ఎక్కువ సహకారం ఆంధ్రప్రదేశ్కు దక్కుతోందని విశాఖలో సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు.
'భవిష్యత్తులో భాజపానే కీలక పార్టీ' - విశాఖలో కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు పర్యటన
ఏపీలో భాజపా త్వరలో పట్టు సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం పట్ల కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నట్లు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశంలో ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు లబ్ది చేకూరుతున్నాయని వివరించారు.
!['భవిష్యత్తులో భాజపానే కీలక పార్టీ'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4944434-1074-4944434-1572724443317.jpg?imwidth=3840)
భవిష్యత్తులో భాజపానే కీలక పార్టీగా రాష్ట్రంలో అవతరిస్తుందని కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు జోస్యం చెప్పారు. ప్రజా లబ్ధి చేకూర్చే పథకాలను ఈ రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశ వ్యాప్తంగా వేలాది మంది 'ఆయుష్మాన్ భారత్' పథకంలో లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. వారంతా తమ నేతలను కలిసి కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ను వైఎస్సార్ ఆరోగ్య శ్రీగా మార్చి ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. ముద్ర , ఉజ్వల, కిసాన్ యోజన లాంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్రం పట్ల కేంద్రానికి ప్రత్యేక దృష్టి ఉందన్నారు. విశాఖకు రైల్వే జోన్ ప్రకటించే సమయంలో ఆయన రైల్వే మంత్రిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రం కంటే.. ఎక్కువ సహకారం ఆంధ్రప్రదేశ్కు దక్కుతోందని విశాఖలో సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు.