ETV Bharat / city

ఆర్​సీడీ ఆసుపత్రి ఆవరణం.. జీవ వైవిధ్య వనం

author img

By

Published : Aug 8, 2021, 10:43 AM IST

Updated : Aug 8, 2021, 10:16 PM IST

రాష్ట్రంలోనే మొట్టమొదటి జీవ వైవిధ్యవనం... విద్యార్థులకు మరింత ఉపయోగపడేలా అభివృద్ధి చెందలేకపోతోంది. విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు లెక్కకు మించిన వృక్షజాతుల్ని అందిస్తున్న విశాఖలోని విజ్ఞానతోట... భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుందో లేదో అనే సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వ సహకారం లేకపోవటం... ఆర్థిక వనరులు లోపించటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఆర్​సీడీ ఆసుపత్రి
ఆర్​సీడీ ఆసుపత్రి
ఆర్​సీడీ ఆసుపత్రి ఆవరణం.. జీవ వైవిధ్య వనం

విశాఖలోని రాణీ చంద్రమదేవి - ఆర్​సీడీ ఆసుపత్రి ఆవరణలో ఉన్న జీవ వైవిధ్యవనానికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. అంతరించిపోతున్న జీవజాతులపై భావితరాలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో... డాల్ఫిన్‌ నేచర్‌ కన్జర్వేటివ్‌ సొసైటీగా ఏర్పడ్డారు. దేశంలోని నలుమూలల నుంచి మొక్కల్ని సేకరించి ఇక్కడ ఉంచారు. 2 వేలకుపైగా వృక్షజాతులను చూడొచ్చు. 2001లో పార్క్‌ పనులు ప్రారంభంకాగా... 2002లో ప్రభుత్వ సహకారంతో ఆర్​సీడీ ఆసుపత్రి ఆవరణలోని 3 ఎకరాల్లో మొక్కలు పెంచారు. ఆసక్తికొద్దీ 2013 దాకా సొసైటీ సభ్యులే తలో చేయి వేసి వనాన్ని నిర్వహించుకుంటూ వచ్చి అందంగా తీర్చిదిద్దారు.

2013 తరువాత ఆర్థిక ఇబ్బందులు రావడంతో... ఉడా అధికారులు ఈ వనాన్ని దత్తత తీసుకున్నారు. హుద్‌హుద్‌ తుపాను దాకా ఇది కొనసాగింది. ఆ తరువాత అధికారులు మారటం ఇతర కారణాలతో దత్తత సాయం ముగిసింది. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ప్రజలే విరాళాల ద్వారా నడిపిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ పార్క్‌ను ప్రభుత్వం గుర్తించకపోవటంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భావితరాలకు జీవవైవిద్య పరిజ్ఞానం అందించాలంటే ఇలాంటి వాటికి ప్రోత్సాహం అందించాలి. -ఎం.మంగతాయి, డీఎన్‌సీఎస్‌ సహవ్యవస్థాపకురాలు

ఇక్కడి మొక్కల్ని చూసేందుకు, నమూనాల్ని తీసుకెళ్లేందుకు ఎంతోమంది ఫార్మసీ, బాటనీ విద్యార్థులు, ప్రొఫెసర్లు వస్తుంటారు. ఈ పార్కులో దొరికే మొక్కల్ని పరిశోధించిన తర్వాత సుమారు 10కిపైగా జర్నల్స్‌ వెలువడినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. -దుర్గాప్రసాద్, ఎంబీఏ విద్యార్థి

జీవ వైవిధ్య వనానికి 2017లో ఏపీ గ్రీన్‌ అండ్‌ అర్బన్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ‘గ్రీన్‌ అవార్డు" ఇచ్చింది. 2018, 2021లో ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఉత్తమ జీవ వైవిధ్యంగా ప్రకటించింది. 400రకాలకు పైగా అరుదైన వృక్షసంపద ఈ ప్రాంతంలో తొణికిసలాడుతోంది. రాక్షస బల్లుల కాలంలోని చెట్లు, అంతరించిపోతున్న జాతులైన ఎర్రచందనం, కొండగోగు, సర్పగంధ, శ్రీగంధం లాంటివీ ఉన్నాయి. -డా.రామమూర్తి, డీఎన్‌సీఎస్‌ వ్యవస్థాపకురాలు

సంప్రదాయ ఔషధ మొక్కల పెంపకంపై అవగాహన కోసం వాటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో... ఎక్కడ స్థలమున్నా పెంచేందుకు సుమారు 400రకాల్ని సిద్ధంచేసి ఉంచారు.

ఇదీ చదవండి: అధికారుల నిర్లక్ష్యం.. కోట్లు విలువైన వాహనాలకు తుప్పు

ఆర్​సీడీ ఆసుపత్రి ఆవరణం.. జీవ వైవిధ్య వనం

విశాఖలోని రాణీ చంద్రమదేవి - ఆర్​సీడీ ఆసుపత్రి ఆవరణలో ఉన్న జీవ వైవిధ్యవనానికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. అంతరించిపోతున్న జీవజాతులపై భావితరాలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో... డాల్ఫిన్‌ నేచర్‌ కన్జర్వేటివ్‌ సొసైటీగా ఏర్పడ్డారు. దేశంలోని నలుమూలల నుంచి మొక్కల్ని సేకరించి ఇక్కడ ఉంచారు. 2 వేలకుపైగా వృక్షజాతులను చూడొచ్చు. 2001లో పార్క్‌ పనులు ప్రారంభంకాగా... 2002లో ప్రభుత్వ సహకారంతో ఆర్​సీడీ ఆసుపత్రి ఆవరణలోని 3 ఎకరాల్లో మొక్కలు పెంచారు. ఆసక్తికొద్దీ 2013 దాకా సొసైటీ సభ్యులే తలో చేయి వేసి వనాన్ని నిర్వహించుకుంటూ వచ్చి అందంగా తీర్చిదిద్దారు.

2013 తరువాత ఆర్థిక ఇబ్బందులు రావడంతో... ఉడా అధికారులు ఈ వనాన్ని దత్తత తీసుకున్నారు. హుద్‌హుద్‌ తుపాను దాకా ఇది కొనసాగింది. ఆ తరువాత అధికారులు మారటం ఇతర కారణాలతో దత్తత సాయం ముగిసింది. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ప్రజలే విరాళాల ద్వారా నడిపిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ పార్క్‌ను ప్రభుత్వం గుర్తించకపోవటంపై నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భావితరాలకు జీవవైవిద్య పరిజ్ఞానం అందించాలంటే ఇలాంటి వాటికి ప్రోత్సాహం అందించాలి. -ఎం.మంగతాయి, డీఎన్‌సీఎస్‌ సహవ్యవస్థాపకురాలు

ఇక్కడి మొక్కల్ని చూసేందుకు, నమూనాల్ని తీసుకెళ్లేందుకు ఎంతోమంది ఫార్మసీ, బాటనీ విద్యార్థులు, ప్రొఫెసర్లు వస్తుంటారు. ఈ పార్కులో దొరికే మొక్కల్ని పరిశోధించిన తర్వాత సుమారు 10కిపైగా జర్నల్స్‌ వెలువడినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. -దుర్గాప్రసాద్, ఎంబీఏ విద్యార్థి

జీవ వైవిధ్య వనానికి 2017లో ఏపీ గ్రీన్‌ అండ్‌ అర్బన్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ‘గ్రీన్‌ అవార్డు" ఇచ్చింది. 2018, 2021లో ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఉత్తమ జీవ వైవిధ్యంగా ప్రకటించింది. 400రకాలకు పైగా అరుదైన వృక్షసంపద ఈ ప్రాంతంలో తొణికిసలాడుతోంది. రాక్షస బల్లుల కాలంలోని చెట్లు, అంతరించిపోతున్న జాతులైన ఎర్రచందనం, కొండగోగు, సర్పగంధ, శ్రీగంధం లాంటివీ ఉన్నాయి. -డా.రామమూర్తి, డీఎన్‌సీఎస్‌ వ్యవస్థాపకురాలు

సంప్రదాయ ఔషధ మొక్కల పెంపకంపై అవగాహన కోసం వాటిని ఉచితంగా పంపిణీ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో... ఎక్కడ స్థలమున్నా పెంచేందుకు సుమారు 400రకాల్ని సిద్ధంచేసి ఉంచారు.

ఇదీ చదవండి: అధికారుల నిర్లక్ష్యం.. కోట్లు విలువైన వాహనాలకు తుప్పు

Last Updated : Aug 8, 2021, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.