విశాఖ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి అవంతి - విశాఖ ఉత్సవాల వార్తలు
ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖ బీచ్లో జరగబోయే విశాఖ ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ వేడుకలకు సీఎం జగన్ హాజరవుతారని మంత్రి తెలిపారు. కళాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. వేడుక నిర్వహణకు సంబంధించి మంత్రి అవంతి 'ఈటీవీభారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు.