ETV Bharat / city

విశాఖలో కొవిడ్‌ బాధితులకు 300 పడకలు సిద్ధం!

విశాఖ షీలానగర్‌ కూడలిలోని వికాస్‌ కళాశాలలో కొవిడ్‌ బాధితుల కోసం 300 ఆక్సిజన్‌ పడకలను సిద్ధం చేస్తున్నారు. ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా సేవలు అందించేందుకు ట్రస్టు ఛైర్మన్‌, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నిర్ణయించారు. గురువారం సాయంత్రం ఆయన పనులను పర్యవేక్షించారు. ఈ నెల 10 తేదీ నాటి నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

author img

By

Published : May 7, 2021, 11:31 AM IST

విశాఖలో 300 కొవిడ్ బాధితులకు 300 పడకలు
విశాఖలో 300 కొవిడ్ బాధితులకు 300 పడకలు

కరోనా రోగుల‌కు అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఆక్సిజన్ సరఫరా సదుపాయం ఉన్న‌ 300 పడకలు విశాఖ‌లో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ షీలానగర్‌లో ఉన్న వికాస్ విద్యానికేతన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్న ఈ కొవిడ్ వైద్య సేవల కేంద్రం పనులను విజయసాయి రెడ్డి ప‌రిశీలించారు. కొవిడ్ రోగులకు అవసరమైన అత్యవసర వైద్య సహాయాన్ని ఈ కేంద్రంలో అందజేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణానికి బెడ్స్ చేరగా, ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సోమవారం నాటి కల్లా పనులు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి అధికారులకు, ఫౌండేషన్ సభ్యులకు సూచించారు. ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న కొవిడ్ బాధితులు ఈ కేంద్రానికి వచ్చి వైద్య సేవలు పొందే వీలుంటుంది. వైద్యం, మందులతో పాటు రోగులకు మూడు పూటలా మంచి భోజనం కూడా ఇక్కడ అందించాలని విజయసాయి రెడ్డి సూచించారు.

ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్న తమ వారి గురించి తమకు సమాచారం అందటం లేదని రోగుల బంధువులు పలువురు విజయసాయిరెడ్డి దృష్టికి గతంలో తీసుకువచ్చారు. దీంతో ఈ కేంద్రంలో వైద్య సేవలు పొందే రోగులకు సంబంధించిన సమాచారాన్ని వారి బంధువులకు ప్రతిరోజూ అందించే ప్రయత్నం కూడా చేయనున్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ వైద్య సిబ్బంది, జిల్లా వైద్య అధికారుల సహకారం తీసుకుంటున్న‌ట్టు వివ‌రించారు. ప్రతి 30 మంది రోగులకు ఒక డాక్టరు ఇద్దరు నర్సులు వారికి ఇక్కడ అందుబాటులో ఉందన్నారు.ఈ కేంద్రంలోనే ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ శాంపిల్ కలెక్షన్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా రోగుల‌కు అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు ఆక్సిజన్ సరఫరా సదుపాయం ఉన్న‌ 300 పడకలు విశాఖ‌లో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ షీలానగర్‌లో ఉన్న వికాస్ విద్యానికేతన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్న ఈ కొవిడ్ వైద్య సేవల కేంద్రం పనులను విజయసాయి రెడ్డి ప‌రిశీలించారు. కొవిడ్ రోగులకు అవసరమైన అత్యవసర వైద్య సహాయాన్ని ఈ కేంద్రంలో అందజేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణానికి బెడ్స్ చేరగా, ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సోమవారం నాటి కల్లా పనులు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి అధికారులకు, ఫౌండేషన్ సభ్యులకు సూచించారు. ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న కొవిడ్ బాధితులు ఈ కేంద్రానికి వచ్చి వైద్య సేవలు పొందే వీలుంటుంది. వైద్యం, మందులతో పాటు రోగులకు మూడు పూటలా మంచి భోజనం కూడా ఇక్కడ అందించాలని విజయసాయి రెడ్డి సూచించారు.

ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్న తమ వారి గురించి తమకు సమాచారం అందటం లేదని రోగుల బంధువులు పలువురు విజయసాయిరెడ్డి దృష్టికి గతంలో తీసుకువచ్చారు. దీంతో ఈ కేంద్రంలో వైద్య సేవలు పొందే రోగులకు సంబంధించిన సమాచారాన్ని వారి బంధువులకు ప్రతిరోజూ అందించే ప్రయత్నం కూడా చేయనున్నారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ వైద్య సిబ్బంది, జిల్లా వైద్య అధికారుల సహకారం తీసుకుంటున్న‌ట్టు వివ‌రించారు. ప్రతి 30 మంది రోగులకు ఒక డాక్టరు ఇద్దరు నర్సులు వారికి ఇక్కడ అందుబాటులో ఉందన్నారు.ఈ కేంద్రంలోనే ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ శాంపిల్ కలెక్షన్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.