ETV Bharat / city

విజయవాడలో జాంబీరెడ్డి చిత్ర బృందం సందడి

author img

By

Published : Mar 23, 2021, 3:17 PM IST

ఈ నెల 26న ఓటీటీ వేదిక 'ఆహా'లో జాంబీరెడ్డి విడుదల కానుండగా.. సినిమా ప్రమోషన్​లో భాగంగా చిత్ర బృందం విజయవాడ వచ్చింది. కరోనా తరువాత రీలీజైనా.. ప్రేక్షకులు చిత్రాన్ని ఎంతగానో ఆదరించారంటూ హీరో, దర్శకులు ఆనందం వ్యక్తం చేశారు.

zombie reddy movie team came to vijayawada
విజయవాడలో సందడిచేసిన జాంబీరెడ్డి చిత్రబృందం

జాంబీ రెడ్డి చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. హీరోగా తొలి సినిమా విజయం సాధించడం సంతోషంగా ఉందని కథానాయకుడు తేజ అన్నారు. కరోనా తరువాత సినిమా విడుదలైనా ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రాన్ని థియేటర్​లో వీక్షించని వారికోసం.. 'ఆహా'లో ఈనెల 26న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

మొదటిసారిగా జాంబీస్​ని టాలీవుడ్​లో పరిచయం చేశామని చిత్ర దర్శకులు ప్రశాంత్ వర్మ తెలిపారు. ప్రమోషన్​లో భాగంగా విజయవాడకు వచ్చామన్నారు. రాయలసీమ నేపథ్యంలో కామెడీ, హర్రర్ చిత్రం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జాంబిరెడ్డి 2ని త్వరలో తెరకెక్కిస్తామని చెప్పారు.

జాంబీ రెడ్డి చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. హీరోగా తొలి సినిమా విజయం సాధించడం సంతోషంగా ఉందని కథానాయకుడు తేజ అన్నారు. కరోనా తరువాత సినిమా విడుదలైనా ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రాన్ని థియేటర్​లో వీక్షించని వారికోసం.. 'ఆహా'లో ఈనెల 26న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

మొదటిసారిగా జాంబీస్​ని టాలీవుడ్​లో పరిచయం చేశామని చిత్ర దర్శకులు ప్రశాంత్ వర్మ తెలిపారు. ప్రమోషన్​లో భాగంగా విజయవాడకు వచ్చామన్నారు. రాయలసీమ నేపథ్యంలో కామెడీ, హర్రర్ చిత్రం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. జాంబిరెడ్డి 2ని త్వరలో తెరకెక్కిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

మంత్రులు బొత్స, పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.