ETV Bharat / city

శ్రీ కాళహస్తీశ్వరాలయ నకిలీ వెబ్​సైట్​ నిర్వహిస్తోన్న ఉద్యోగి సస్పెండ్​ - vijayawada Cp and srikalahasthi Eo about fake websites

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నకిలీ వెబ్​సైట్ల వ్యవహారంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ వెబ్​సైట్ల ముసుగులో కొందరు అక్రమార్కులు ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. ఆలయాల్లో పనిచేసే ఉద్యోగులే ఈ వ్యవహారంలో నిందితులుగా ఉండడం గమనార్హం. చిత్తూరు జిల్లా కాళహస్తీశ్వర ఆలయంలో నకిలీ వెబ్​సైట్​ నిర్వహిస్తోన్న ఉద్యోగిని ఈవో సస్పెండ్​ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శ్రీ కాళహస్తీశ్వరాలయ నకిలీ వెబ్​సైట్​ నిర్వహిస్తోన్న ఉద్యోగి సస్పెండ్​
శ్రీ కాళహస్తీశ్వరాలయ నకిలీ వెబ్​సైట్​ నిర్వహిస్తోన్న ఉద్యోగి సస్పెండ్​
author img

By

Published : Dec 10, 2019, 8:51 PM IST

Updated : Dec 10, 2019, 9:22 PM IST

నకిలీ ఆలయ వెబ్​సైట్​ నిర్వహిస్తోన్న ఉద్యోగి సస్పెండ్​

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు, ఇతర ఆన్​లైన్​ సేవలకు వేర్వేరుగా అధికారిక వెబ్​సైట్లు ఉన్నాయి. సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, ఇతర ఆలయాల్లో ఆన్​లైన్​ సేవలను... కొందరు నకిలీ వెబ్​సైట్​ల ద్వారా నిర్వహిస్తున్నారని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నకిలీ వెబ్​సైట్​ నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగిని ఈవో చంద్రశేఖర్​రెడ్డి సస్పెండ్​ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు విని మోసపోవద్దంటూ భక్తులకు ఈవో సూచించారు. ఈ కేసును విజయవాడ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దుర్గగుడి నకిలీ వెబ్​సైట్​పై సీపీకి ఫిర్యాదు

నకిలీ ఆలయ వెబ్​సైట్లపై పోలీసుల నిఘా...!

విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం పేరుతో నకిలీ వెబ్​సైట్​లు నిర్వహిస్తున్నారని దుర్గగుడి ఈవో సురేష్ కుమార్ విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన పోలీసులు మొత్తం మూడు రకాల వెబ్​సైట్లు అనధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇవి ఎవరు నిర్వహిస్తున్నారనేది ఇంకా తేలలేదు. ఈ కేసును సైబర్​ క్రైం పోలీసులకు అప్పగించినట్లు సీపీ తెలిపారు. ఐపీ అడ్రస్​ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. నిందితులు దేవాలయ సొత్తును దోచుకుంటున్నారా..? లేక విరాళాల పేరుతో భక్తులను దోచుకుంటున్నారా..? అనే కోణంలో విచారిస్తున్నామని సీపీ వివరించారు.

ఇదీ చూడండి:

'దేవస్థానాల నకిలీ వెబ్​సైట్​లపై చర్యలు తీసుకోండి'

నకిలీ ఆలయ వెబ్​సైట్​ నిర్వహిస్తోన్న ఉద్యోగి సస్పెండ్​

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో పూజలు, ఇతర ఆన్​లైన్​ సేవలకు వేర్వేరుగా అధికారిక వెబ్​సైట్లు ఉన్నాయి. సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, ఇతర ఆలయాల్లో ఆన్​లైన్​ సేవలను... కొందరు నకిలీ వెబ్​సైట్​ల ద్వారా నిర్వహిస్తున్నారని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నకిలీ వెబ్​సైట్​ నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగిని ఈవో చంద్రశేఖర్​రెడ్డి సస్పెండ్​ చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు విని మోసపోవద్దంటూ భక్తులకు ఈవో సూచించారు. ఈ కేసును విజయవాడ సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దుర్గగుడి నకిలీ వెబ్​సైట్​పై సీపీకి ఫిర్యాదు

నకిలీ ఆలయ వెబ్​సైట్లపై పోలీసుల నిఘా...!

విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం పేరుతో నకిలీ వెబ్​సైట్​లు నిర్వహిస్తున్నారని దుర్గగుడి ఈవో సురేష్ కుమార్ విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన పోలీసులు మొత్తం మూడు రకాల వెబ్​సైట్లు అనధికారికంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఇవి ఎవరు నిర్వహిస్తున్నారనేది ఇంకా తేలలేదు. ఈ కేసును సైబర్​ క్రైం పోలీసులకు అప్పగించినట్లు సీపీ తెలిపారు. ఐపీ అడ్రస్​ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. నిందితులు దేవాలయ సొత్తును దోచుకుంటున్నారా..? లేక విరాళాల పేరుతో భక్తులను దోచుకుంటున్నారా..? అనే కోణంలో విచారిస్తున్నామని సీపీ వివరించారు.

ఇదీ చూడండి:

'దేవస్థానాల నకిలీ వెబ్​సైట్​లపై చర్యలు తీసుకోండి'

sample description
Last Updated : Dec 10, 2019, 9:22 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.