ETV Bharat / city

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది?: తెదేపా

author img

By

Published : Jun 27, 2020, 5:05 PM IST

రాష్ట్రంలో సోషల్ మీడియా లాంటి చిన్న చిన్న కేసులకు ఇచ్చిన ప్రాధాన్యత.. వివేకా హత్యలాంటి పెద్ద కేసులకు ఇవ్వడం లేదని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

varla ramaiah on cbi enquiry on viveka murder case
వర్ల రామయ్య, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో సీబీఐ చెప్పాలని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ కేసులో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి 100 రోజులు పూర్తయినందున పురోగతి ఏంటని ప్రశ్నించారు. దీనిపై విచారణను ప్రభుత్వం ఎంతవరకు పరిశీలించిందో సీఎం చెప్పాలన్నారు. ఇప్పటివరకు జరిగిన దానిపై సీబీఐ ప్రకటన విడుదల చేయాలని కోరారు.

'వివేకా హత్య కేసులో మేం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. సీబీఐను డిమాండ్ చేస్తున్నాం. ఆ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది. మీరు ఎంతమందిని విచారించారు. ఎన్ని సాక్ష్యాలు సేకరించారు. వీటన్నింటిపై సీబీఐ ఒక ప్రకటన విడుదల చేయాలి. లేకపోతే విచారణ జరగకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసేలా కేంద్ర హోంశాఖకు లేఖ రాయగలరా అని సీఎం జగన్​ను అడుగుతున్నాం' -వర్ల రామయ్య, తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు

సీబీఐ త్వరితగతిన విచారణ పూర్తి చేసేలా ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర హోంమంత్రి, ప్రధానికి లేఖ రాయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు ఆందోళన కలిగిస్తున్నాయని.. సోషల్ మీడియా లాంటి చిన్న కేసులకు ఇచ్చిన ప్రాధాన్యత, వివేకా హత్య కేసుకు ఇవ్వడం లేదని వర్ల ఆరోపించారు.

ఇవీ చదవండి...

'లోకేశ్ సంతకాలకు అవార్డులు వస్తే.. జగన్ సంతకాలకు ఛార్జ్​ షీట్లు వస్తున్నాయ్'

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో సీబీఐ చెప్పాలని తెదేపా నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ కేసులో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి 100 రోజులు పూర్తయినందున పురోగతి ఏంటని ప్రశ్నించారు. దీనిపై విచారణను ప్రభుత్వం ఎంతవరకు పరిశీలించిందో సీఎం చెప్పాలన్నారు. ఇప్పటివరకు జరిగిన దానిపై సీబీఐ ప్రకటన విడుదల చేయాలని కోరారు.

'వివేకా హత్య కేసులో మేం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. సీబీఐను డిమాండ్ చేస్తున్నాం. ఆ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది. మీరు ఎంతమందిని విచారించారు. ఎన్ని సాక్ష్యాలు సేకరించారు. వీటన్నింటిపై సీబీఐ ఒక ప్రకటన విడుదల చేయాలి. లేకపోతే విచారణ జరగకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసేలా కేంద్ర హోంశాఖకు లేఖ రాయగలరా అని సీఎం జగన్​ను అడుగుతున్నాం' -వర్ల రామయ్య, తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు

సీబీఐ త్వరితగతిన విచారణ పూర్తి చేసేలా ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర హోంమంత్రి, ప్రధానికి లేఖ రాయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు ఆందోళన కలిగిస్తున్నాయని.. సోషల్ మీడియా లాంటి చిన్న కేసులకు ఇచ్చిన ప్రాధాన్యత, వివేకా హత్య కేసుకు ఇవ్వడం లేదని వర్ల ఆరోపించారు.

ఇవీ చదవండి...

'లోకేశ్ సంతకాలకు అవార్డులు వస్తే.. జగన్ సంతకాలకు ఛార్జ్​ షీట్లు వస్తున్నాయ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.