ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM

.

author img

By

Published : Aug 27, 2020, 8:59 PM IST

top news 9pm
top news 9pm
  • నోట్ల కట్టలు... ఆ రైతువేనట..!

అనంతపురం జిల్లాలో జాతీయ రహదారిపై నోట్ల కట్టలు పడి ఉన్నాయనే సమాచారం కలకలం రేపింది. రాయదుర్గం మండలంలోని వడ్రవన్నూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రూ.10లక్షల విలువ చేసే రూ.500నోట్ల కట్టలు చెల్లాచెదురుగా పడి ఉండగా కొందరు వాటిని ఎత్తుకెళ్లినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి!

కడప జిల్లా నేతకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి, కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యర్రగుంట్లకు చెందిన అంబటి కృష్ణారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మాస్కే కవచం.. పోస్టర్ విడుదల

మాస్కే కవచం పేరిట నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి ఆళ్లనాని ప్రచార పత్రాలను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • విజయవాడలో మరో అగ్నిప్రమాదం

విజయవాడ హనుమాన్​పేట స్టేషన్​రోడ్​లో ఓ చెప్పుల గోడౌన్​లో జరిగిన అగ్నిప్రమాదం మరవకముందే... అదే ప్రాంతంలో అదే షాప్​లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. చెప్పుల గోడౌన్ మొత్తం రబ్బరుతో ఉండటం కారణంగా ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కాంగ్రెస్​ పతనానికి అవే కారణాలు

కాంగ్రెస్​లో సమూల మార్పులు చేపట్టాలంటూ 23 మంది సీనియర్ నేతలు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతటి సంక్షోభం ఏర్పడడానికి కారణాలపై నిపుణులతో చర్చాగోష్టి నిర్వహించింది ఈటీవీ భారత్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎన్ని ఆధారాలిచ్చినా పాక్ పనిచేయదంతే

పుల్వామా దాడికి సంబంధించి పాకిస్థాన్​పై ఘాటు వ్యాఖ్యలు చేసింది భారత విదేశీ వ్యవహారాల శాఖ. ఘటనకు ప్రధాన కారకుడైన మసూద్ అజర్ ఇప్పటికీ పాక్​లోనే ఉండటం విచారకరమని పేర్కొంది. ఉగ్రదాడి ఘటనపై పాక్​కు ఎన్ని ఆధారాలు ఇచ్చినా.. తన బాధ్యతను మాత్రం విస్మరిస్తూనే ఉందని మండిపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కర్ణాటకలో కరోనా కల్లోలం

భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో ఇప్పటికే 33 లక్షల మంది వైరస్​ బారిన పడగా.. 60 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తర్​ప్రదేశ్​, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో కొవిడ్​ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఏటీఎంలపై కన్నేసిన ఉత్తర కొరియా హ్యాకర్లు

ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఉత్తరకొరియాకు చెందిన కొందరు కేటుగాళ్లు మాత్రం హ్యాకింగ్​తో డబ్బులు కొట్టేసే పనిలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంక్​ ఏటీఎంలే లక్ష్యంగా ఫిషింగ్​ దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది అమెరికా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఫామ్​ చెక్కు చెదరలేదు

దిగ్గజ డాన్​ బ్రాడ్​మన్​ 112వ జయంతి సందర్భంగా.. ఆయనను స్మరించుకుని జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు సచిన్ తెందుల్కర్. ప్రతిఆటగాడికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మానసిక మానభంగం చేస్తున్నారు

అత్యాచారం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని యాంకర్ ప్రదీప్ అన్నారు. ఇందులో నిజనిజాలు తెలియకుండా ఇష్టమొచ్చినట్లు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నోట్ల కట్టలు... ఆ రైతువేనట..!

అనంతపురం జిల్లాలో జాతీయ రహదారిపై నోట్ల కట్టలు పడి ఉన్నాయనే సమాచారం కలకలం రేపింది. రాయదుర్గం మండలంలోని వడ్రవన్నూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రూ.10లక్షల విలువ చేసే రూ.500నోట్ల కట్టలు చెల్లాచెదురుగా పడి ఉండగా కొందరు వాటిని ఎత్తుకెళ్లినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి!

కడప జిల్లా నేతకు ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి, కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యర్రగుంట్లకు చెందిన అంబటి కృష్ణారెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మాస్కే కవచం.. పోస్టర్ విడుదల

మాస్కే కవచం పేరిట నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి ఆళ్లనాని ప్రచార పత్రాలను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • విజయవాడలో మరో అగ్నిప్రమాదం

విజయవాడ హనుమాన్​పేట స్టేషన్​రోడ్​లో ఓ చెప్పుల గోడౌన్​లో జరిగిన అగ్నిప్రమాదం మరవకముందే... అదే ప్రాంతంలో అదే షాప్​లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. చెప్పుల గోడౌన్ మొత్తం రబ్బరుతో ఉండటం కారణంగా ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కాంగ్రెస్​ పతనానికి అవే కారణాలు

కాంగ్రెస్​లో సమూల మార్పులు చేపట్టాలంటూ 23 మంది సీనియర్ నేతలు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతటి సంక్షోభం ఏర్పడడానికి కారణాలపై నిపుణులతో చర్చాగోష్టి నిర్వహించింది ఈటీవీ భారత్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎన్ని ఆధారాలిచ్చినా పాక్ పనిచేయదంతే

పుల్వామా దాడికి సంబంధించి పాకిస్థాన్​పై ఘాటు వ్యాఖ్యలు చేసింది భారత విదేశీ వ్యవహారాల శాఖ. ఘటనకు ప్రధాన కారకుడైన మసూద్ అజర్ ఇప్పటికీ పాక్​లోనే ఉండటం విచారకరమని పేర్కొంది. ఉగ్రదాడి ఘటనపై పాక్​కు ఎన్ని ఆధారాలు ఇచ్చినా.. తన బాధ్యతను మాత్రం విస్మరిస్తూనే ఉందని మండిపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • కర్ణాటకలో కరోనా కల్లోలం

భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో ఇప్పటికే 33 లక్షల మంది వైరస్​ బారిన పడగా.. 60 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తర్​ప్రదేశ్​, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో కొవిడ్​ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఏటీఎంలపై కన్నేసిన ఉత్తర కొరియా హ్యాకర్లు

ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ఉత్తరకొరియాకు చెందిన కొందరు కేటుగాళ్లు మాత్రం హ్యాకింగ్​తో డబ్బులు కొట్టేసే పనిలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంక్​ ఏటీఎంలే లక్ష్యంగా ఫిషింగ్​ దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది అమెరికా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఫామ్​ చెక్కు చెదరలేదు

దిగ్గజ డాన్​ బ్రాడ్​మన్​ 112వ జయంతి సందర్భంగా.. ఆయనను స్మరించుకుని జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు సచిన్ తెందుల్కర్. ప్రతిఆటగాడికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మానసిక మానభంగం చేస్తున్నారు

అత్యాచారం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని యాంకర్ ప్రదీప్ అన్నారు. ఇందులో నిజనిజాలు తెలియకుండా ఇష్టమొచ్చినట్లు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.