ETV Bharat / city

ఎన్టీఆర్ భవన్​లో అంబేడ్కర్ జయంతి.. "దళితుల ప్రతిఘటన" పుస్తక ఆవిష్కరణ..!!

author img

By

Published : Apr 14, 2022, 3:49 PM IST

TDP Leaders Pay Tribute To Ambedkar: తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో అంబేడ్కర్ జయంతిని ఘనంగా తెదేపా ముఖ్యనేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి, పీతల సుజాత, వర్ల రామయ్య ఇతర ముఖ్యనేతలు పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. "దళితుల ప్రతిఘటన" పేరిట రూపొందించిన ఓ పుస్తకాన్ని అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.

TDP Leaders Pay Tribute To Ambedkar
ఎన్టీఆర్ భవన్​లో అంబేడ్కర్ జయంతి

TDP Leaders Pay Tribute To Ambedkar: రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. నోటికి ప్లాస్టర్లు అంటించి, నాలుగు మంత్రి పదవులిస్తే అది సామాజిక న్యాయం ఎలా అవుతుందని నిలదీశారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి, పీతల సుజాత, వర్ల రామయ్య ఇతర ముఖ్యనేతలు పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. దళితుల ప్రతిఘటన పేరిట రూపొందించిన ఓ పుస్తకాన్ని అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.

ప్రజల్లో చైతన్యం లేకే గత ఎన్నికల్లో తెదేపాని ఓడించారన్న అచ్చెన్న.. ఏ వర్గానికీ తెలుగుదేశం తక్కువ చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతులు కాకుంటే ఇక బానిస బతుకులేనని హెచ్చరించారు. పేదలను లక్ష్యంగా చేసుకుని వారిపై జగన్మోహన్ రెడ్డి ఆర్థికభారం మోపుతున్నారని దుయ్యబట్టారు.

అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా తెదేపా ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడని పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిచిన హక్కులు సైతం రాష్ట్రంలో ఎస్సీలకు లేకుండా చేశారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: అంబేడ్కర్​ జయంతి వేడుకలు... నివాళులర్పించిన సీఎం జగన్​

TDP Leaders Pay Tribute To Ambedkar: రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడుందో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. నోటికి ప్లాస్టర్లు అంటించి, నాలుగు మంత్రి పదవులిస్తే అది సామాజిక న్యాయం ఎలా అవుతుందని నిలదీశారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి, పీతల సుజాత, వర్ల రామయ్య ఇతర ముఖ్యనేతలు పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. దళితుల ప్రతిఘటన పేరిట రూపొందించిన ఓ పుస్తకాన్ని అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు.

ప్రజల్లో చైతన్యం లేకే గత ఎన్నికల్లో తెదేపాని ఓడించారన్న అచ్చెన్న.. ఏ వర్గానికీ తెలుగుదేశం తక్కువ చేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలు చైతన్యవంతులు కాకుంటే ఇక బానిస బతుకులేనని హెచ్చరించారు. పేదలను లక్ష్యంగా చేసుకుని వారిపై జగన్మోహన్ రెడ్డి ఆర్థికభారం మోపుతున్నారని దుయ్యబట్టారు.

అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా తెదేపా ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడని పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. రాజ్యాంగంలో అంబేడ్కర్ పొందుపరిచిన హక్కులు సైతం రాష్ట్రంలో ఎస్సీలకు లేకుండా చేశారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: అంబేడ్కర్​ జయంతి వేడుకలు... నివాళులర్పించిన సీఎం జగన్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.