ETV Bharat / city

TDP: ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా తీవ్ర విమర్శలు

author img

By

Published : Feb 26, 2022, 8:46 PM IST

TDP Leaders on CM YS Jagan : ముఖ్యమంత్రి జగన్​పై తెలుగుదేశం నేతలు తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా పాలనలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని కూడా లేదని ఆరోపించారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిపాత్రపై సాక్ష్యాలు బయటపెట్టాక కూడా ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పట్లేదని మండిపడ్డారు.

TDP Leaders on CM YS Jagan
TDP Leaders on CM YS Jagan

TDP Leaders on CM YS Jagan: వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా.. ఇంకా తెదేపా ప్రభుత్వంపైనే బురదజల్లితే ఎలా అని రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి పెద్దిరెడ్డిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నిలదీశారు. నిజంగా తెదేపా హయాంలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి జరిగితే.. అధికారంలో ఉన్న మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. తన అసమర్థత, వైకాపా ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చడానికే పంచాయతీ రాజ్ మంత్రి.. తెదేపాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడేళ్లనుంచి.. గతప్రభుత్వంలో పనులుచేసిన వారికి బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా పాలనలో నిర్మించిన పంచాయతీ భవనాలు, అంగన్​వాడీ భవనాలు, శ్మశానవాటికలకు రంగులేసుకోవడం తప్ప.. ఎక్కడా ఒక్క పని కూడా చేయలేదని అమర్నాథ్‌రెడ్డి విమర్శించారు.

తక్షణమే ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయాలి..
వైఎస్​ వివేకా హత్యకేసులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్​కు రాజకోట రహస్యమంతా తెలుసని అన్నారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిపాత్రపై సాక్షాలు బయటపడ్డాక కూడా ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పడని మండిపడ్డారు. అసలుదోషులను అరెస్ట్ చేయడానికి సీబీఐ ఎందుకు తటపటాయిస్తోందన్నారు. లోక్ సభ స్పీకర్ అనుమతి తీసుకొని తక్షణమే ఎంపీ అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జగన్​ పాలనలో ఒక్క అభివృద్ధి పని లేదు..
రాష్ట్రంలో సీఎం పదవి కూడా పొరుగు సేవగా మారిస్తే పీడ వదలుతుందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ మండిపడ్డారు. జగన్ పాలనలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని కూడా లేదని ఆయన విమర్శించారు. జగన్ తప్ప ఏ సీఎం కూడా.. సినిమా టికెట్ల విషయంలో జోక్యం చేసుకోలేదని విమర్శించారు. సినిమా టికెట్ల ధరలను పెంచి ప్రజల గుండెల్లో చోటు చేసుకున్న నాయకులను దెబ్బతీయాలనుకుంటున్నారని మోకా ఆనంద్‌సాగర్‌ ఆరోపించారు.

TDP Leaders on CM YS Jagan: వైకాపా అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా.. ఇంకా తెదేపా ప్రభుత్వంపైనే బురదజల్లితే ఎలా అని రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి పెద్దిరెడ్డిని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నిలదీశారు. నిజంగా తెదేపా హయాంలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి జరిగితే.. అధికారంలో ఉన్న మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. తన అసమర్థత, వైకాపా ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చడానికే పంచాయతీ రాజ్ మంత్రి.. తెదేపాపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడేళ్లనుంచి.. గతప్రభుత్వంలో పనులుచేసిన వారికి బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా పాలనలో నిర్మించిన పంచాయతీ భవనాలు, అంగన్​వాడీ భవనాలు, శ్మశానవాటికలకు రంగులేసుకోవడం తప్ప.. ఎక్కడా ఒక్క పని కూడా చేయలేదని అమర్నాథ్‌రెడ్డి విమర్శించారు.

తక్షణమే ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయాలి..
వైఎస్​ వివేకా హత్యకేసులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్​కు రాజకోట రహస్యమంతా తెలుసని అన్నారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిపాత్రపై సాక్షాలు బయటపడ్డాక కూడా ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పడని మండిపడ్డారు. అసలుదోషులను అరెస్ట్ చేయడానికి సీబీఐ ఎందుకు తటపటాయిస్తోందన్నారు. లోక్ సభ స్పీకర్ అనుమతి తీసుకొని తక్షణమే ఎంపీ అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జగన్​ పాలనలో ఒక్క అభివృద్ధి పని లేదు..
రాష్ట్రంలో సీఎం పదవి కూడా పొరుగు సేవగా మారిస్తే పీడ వదలుతుందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ మండిపడ్డారు. జగన్ పాలనలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని కూడా లేదని ఆయన విమర్శించారు. జగన్ తప్ప ఏ సీఎం కూడా.. సినిమా టికెట్ల విషయంలో జోక్యం చేసుకోలేదని విమర్శించారు. సినిమా టికెట్ల ధరలను పెంచి ప్రజల గుండెల్లో చోటు చేసుకున్న నాయకులను దెబ్బతీయాలనుకుంటున్నారని మోకా ఆనంద్‌సాగర్‌ ఆరోపించారు.

ఇదీ చదవండి:

విద్యార్థులకు సాయం చేయండి.. ఆ ఖర్చులను మేం భరిస్తాం - చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.