కోటిపల్లి-నర్సాపురం, విజయవాడ-విశాఖపట్నం మెట్రో, అమరావతి మెట్రో రైల్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి గాలికొదిలేశారని తెదేపా నేత సయ్యద్ రఫీ ధ్వజమెత్తారు. రూ.523కోట్లు ఖర్చుచేసిన కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ వద్దని చెప్పడమేంటని ప్రశ్నించారు. ఆ రైల్వే లైన్ గత ప్రభుత్వ హయాంలో వచ్చింది కాబట్టి, పూర్తైతే తెదేపాకు పేరొస్తుందని ముఖ్యమంత్రి వద్దంటున్నారా? అని నిలదీశారు. రాజశేఖర్ రెడ్డి కావాలన్న కడప-బెంగళూరు రైల్వే లైన్ కూడా జగన్మోహన్ రెడ్డి వద్దంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం నిధులు, భూమి ఇవ్వకుంటే తాము రైల్వే ప్రాజెక్టులు ఎలా పూర్తిచేస్తామని కేంద్రమంత్రి చెప్పడం రాష్ట్రానికి అవమానం కాదా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: వ్యాక్సినేషన్కు ఎన్నికల ప్రక్రియ అడ్డు తగిలింది: సీఎం జగన్