ETV Bharat / city

117జీవోను రద్దు చేయాలని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళన..

author img

By

Published : Jun 16, 2022, 8:12 PM IST

అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం.... విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తోందని ఆరోపిస్తూ ఉపాధ్యాయులు నిరసన బాట పట్టారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా.. డీఈవో కార్యాలయాల ముందు ఆందోళనకు దిగారు. 117 జీవోను వెంటనే రద్దు చేయాలంటూ.. ముక్త కంఠంతో నినదించారు.

statewide
statewide
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళన.. 117జీవోను రద్దు చేయాలని డిమాండ్‌

అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసనలో పాల్గొన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 117జీవో వల్ల పాఠశాల విద్యారంగం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. వేలాది ప్రాథమిక స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం జారీ చేసిన జీవో.నెంబర్ 117ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ కడప డీఈవో కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. విలీనం పేరుతో విద్యారంగాన్ని ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తోందంటూ..అనంతపురంలో ఉపాధ్యాయ నేతలు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. 117 జీవో వల్ల..పాఠశాల విద్యారంగం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయుల ఆందోళన నిర్వహించారు.

విశాఖలోనూ ఉపాధ్యాయ నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాల వల్ల..విద్యా విధానం కుంటుపడే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యార్థులే ఏదో ఒకటి ఎంచుకునే వెసులుబాటు కల్పించాలంటూ ఏలూరులో ధర్నా చేపట్టారు. జీవో 117కు వ్యతిరేకంగా..విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో..ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని నినదించారు. అస్తవ్యస్త విధానాల వల్ల.. పిల్లల చదువుల్లో నాణ్యత దెబ్బతింటోందంటూ ఒంగోలులో ఉపాధ్యాయులు విమర్శించారు. 117 జీవోను రద్దు చేసేవరకూ పోరాటం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.


ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళన.. 117జీవోను రద్దు చేయాలని డిమాండ్‌

అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసనలో పాల్గొన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. 117జీవో వల్ల పాఠశాల విద్యారంగం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. వేలాది ప్రాథమిక స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం జారీ చేసిన జీవో.నెంబర్ 117ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ కడప డీఈవో కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. విలీనం పేరుతో విద్యారంగాన్ని ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తోందంటూ..అనంతపురంలో ఉపాధ్యాయ నేతలు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. 117 జీవో వల్ల..పాఠశాల విద్యారంగం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధ్యాయుల ఆందోళన నిర్వహించారు.

విశాఖలోనూ ఉపాధ్యాయ నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాల వల్ల..విద్యా విధానం కుంటుపడే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యార్థులే ఏదో ఒకటి ఎంచుకునే వెసులుబాటు కల్పించాలంటూ ఏలూరులో ధర్నా చేపట్టారు. జీవో 117కు వ్యతిరేకంగా..విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైఖరి నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో..ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలని నినదించారు. అస్తవ్యస్త విధానాల వల్ల.. పిల్లల చదువుల్లో నాణ్యత దెబ్బతింటోందంటూ ఒంగోలులో ఉపాధ్యాయులు విమర్శించారు. 117 జీవోను రద్దు చేసేవరకూ పోరాటం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.


ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.