ETV Bharat / city

ఉన్నత విద్యలో కొత్త కోర్సులు.. రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు - విజయవాడ న్యూస్

ఆధునిక సమాజం, వివిధ పరిశ్రమలకు అవసరమయ్యే విధంగా ఉన్నత విద్యలో కొత్త కోర్సుల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. దీనికి సంబంధించి ఉన్నత విద్యా ప్రణాళికా బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

State government exercise to design new courses in higher education
ఉన్నత విద్యలో కొత్త కోర్సుల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
author img

By

Published : Jan 22, 2021, 6:37 AM IST

ఉన్నత విద్యలో కొత్త కోర్సుల రూపకల్పన, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ సంస్థలకు ఉపకరించే కోర్సులపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ.. ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కమిటీ ఆధునిక సమాజం, వివిధ పరిశ్రమలకు అవసరమయ్యే కొత్త కోర్సుల ఏర్పాటుపై కసరత్తు చేయాల్సి ఉంది. ప్రణాళిక బోర్డు నిర్వహణకు అవసరమయ్యే నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలియజేసింది.

ఉన్నత విద్యలో కొత్త కోర్సుల రూపకల్పన, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్ సంస్థలకు ఉపకరించే కోర్సులపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ.. ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కమిటీ ఆధునిక సమాజం, వివిధ పరిశ్రమలకు అవసరమయ్యే కొత్త కోర్సుల ఏర్పాటుపై కసరత్తు చేయాల్సి ఉంది. ప్రణాళిక బోర్డు నిర్వహణకు అవసరమయ్యే నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలియజేసింది.

ఇదీ చదవండి:

'మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి త్వరగా భూమి సేకరించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.